HYD News: అతివేగానికి కుమారుడు బలి.. భర్తపై ఠాణాలో భార్య ఫిర్యాదు

తన భర్త నిర్లక్ష్యం.. అతి వేగంతో కారు నడపడంతో కుమారుడు మృతి చెందాడని

Published : 05 Jun 2022 08:49 IST

శంకర్‌పల్లి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: తన భర్త నిర్లక్ష్యం.. అతి వేగంతో కారు నడపడంతో కుమారుడు మృతి చెందాడని ఓ మహిళ శంకరపల్లి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన రహీం(38), రేష్మ(30) దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె ఆశ్యుబేగం(13), కుమారుడు రెహమాన్‌(10) ఉన్నారు. శుక్రవారం శంకర్‌పల్లిలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి సాయంత్రం వచ్ఛి. అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. రహీం కారును అతివేగం, నిర్లక్ష్యంగా నడపడంతో శంకర్‌పల్లి మండలం కచ్చిరెడ్డిగూడ గ్రామ శివారులోని మూలమలుపు వద్ద కారు బోల్తా పడింది. దీంతో కారులోని రెహమాన్‌(10) డోర్‌నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తన కుమారుడి మృతికి తన భర్త నిర్లక్ష్యమే కారణమంటూ భార్య రేష్మ(30) శనివారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని