super star krishna: కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, భారీగా అభిమానులు పద్మాలయ స్టూడియోకు తరలివస్తున్నారు.

Updated : 16 Nov 2022 13:31 IST

హైదరాబాద్‌ : సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, భారీగా అభిమానులు పద్మాలయ స్టూడియోకు తరలివస్తున్నారు. కృష్ణ పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ నివాళులు అర్పించారు. అనంతరం మహేశ్‌బాబు కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో మధ్యాహ్నం 12.30 వరకు ఉంచనున్నారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని