Godavari Express: ఎల్హెచ్బీ బోగీలతో తప్పిన పెనుముప్పు
గోదావరి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ప్రమాదానికి గురైనవి ఎల్హెచ్బీ (లింకు హాఫ్మన్ బుష్)బోగీలు కావడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈనాడు, హైదరాబాద్: గోదావరి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ప్రమాదానికి గురైనవి ఎల్హెచ్బీ (లింకు హాఫ్మన్ బుష్)బోగీలు కావడంతో పెను ప్రమాదం తప్పింది. యాంటీ టెలిస్కోపిక్ టెక్నాలజీతో వీటిని రూపొందించడం వల్ల.. పట్టాలు తప్పినప్పుడు కోచ్లు విడిపోతాయి. రెండు బోగీలు ఢీకొట్టుకోవడం.. పక్కకు పడిపోవడం జరగదు. ఇలాగే గోదావరి ఎక్స్ప్రెస్ బోగీలు 6 విడిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో వివరించారు. అలాగే ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్, ఎయిర్ డిస్కు బ్రేకులు ఉండడంతో కూడా ఒక బోగీపైకి మరొకటి వెళ్లలేదని చెప్పారు.
2000 సంవత్సరం నుంచి ఎల్హెచ్బీ బోగీలను వినియోగిస్తున్నారు. ముందుగా శతాబ్ది ఎక్స్ప్రెస్లో జర్మనీ నుంచి తెచ్చిన 24 ఎయిర్ కండిషన్ బోగీలను వినియోగించారు. ఈ బోగీలను ప్రస్తుతం పంజాబ్లోని కపుర్తలాలో తయారు చేస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని జోన్లలో వీటిని పెంచుకుంటూ వెళ్తున్నారు. గోదావరి ఎక్స్ప్రెస్లో దాదాపు 1500 మంది ప్రయాణిస్తున్నారని రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పట్టాలు తప్పిన 6 బోగీల్లో ఒకటి జనరల్ బోగీ కాగా అందులో 120 మంది వరకూ ప్రయాణికులుంటారని అంచనా వేశారు. ఒకటి సరకు రవాణా బోగీ. మిగతా 4 స్లీపర్ క్లాస్వి. ఈ నాలుగింటిలో 300 మంది వరకూ ఉంటారని అధికారులు అంచనా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..