భద్రాచలంలో ఘనంగా పుష్కర తీర్థయాత్ర
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఆధ్వర్యంలో ఆదివారం పుష్కర తీర్థయాత్ర అట్టహాసంగా సాగింది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఆధ్వర్యంలో ఆదివారం పుష్కర తీర్థయాత్ర అట్టహాసంగా సాగింది. వివిధ నదులతో పాటు పుష్కరిణులు, సముద్రాల్లో తీర్థజలాలను వైదిక సిబ్బంది తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు గోదావరి బ్రిడ్జి సెంటర్లోని అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో తీర్థ జలాల కలశాలను ఉంచగా ఈవో రమాదేవి, ఏఈవోలు శ్రావణ్కుమార్, భవాని రామకృష్ణ యాత్రను ఆరంభించారు. ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, వైదిక పెద్దలు మంత్రోచ్ఛారణ చేస్తుండగా శేషవాహనంతో పాటు మరో రెండు వాహనాల్లో తీర్థజలాలను ఊరేగించి ఆలయానికి చేర్చారు. 31న ఈ జలాలతో స్వామివారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక క్రతువును నిర్వహించనున్నట్లు వైదిక పెద్దలు తెలిపారు.
న్యూస్టుడే, భద్రాచలం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: కీలక పోరులో భారత్ తడ‘బ్యాటు’.. రెండో రోజు ముగిసిన ఆట
-
General News
SriKalahasti: ముక్కంటి ఆలయానికి సమీపంలోని కైలాసగిరిలో అగ్ని ప్రమాదం
-
India News
Miss World 2023: ఈసారి మిస్ వరల్డ్ పోటీలు భారత్లోనే..దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ!
-
India News
Odisha Accident Effect: ట్రైన్ మేనేజర్లు, కంట్రోలర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్.. రైల్వే బోర్డు కీలక సూచన
-
India News
Nirmala Sitharaman: నిరాడంబరంగా నిర్మలాసీతారామన్ కుమార్తె వివాహం
-
India News
USA: మోదీ పర్యటన.. వాటిపైనే కీలక చర్చలు: శ్వేతసౌధం