భద్రాచలంలో ఘనంగా పుష్కర తీర్థయాత్ర
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఆధ్వర్యంలో ఆదివారం పుష్కర తీర్థయాత్ర అట్టహాసంగా సాగింది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఆధ్వర్యంలో ఆదివారం పుష్కర తీర్థయాత్ర అట్టహాసంగా సాగింది. వివిధ నదులతో పాటు పుష్కరిణులు, సముద్రాల్లో తీర్థజలాలను వైదిక సిబ్బంది తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు గోదావరి బ్రిడ్జి సెంటర్లోని అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో తీర్థ జలాల కలశాలను ఉంచగా ఈవో రమాదేవి, ఏఈవోలు శ్రావణ్కుమార్, భవాని రామకృష్ణ యాత్రను ఆరంభించారు. ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, వైదిక పెద్దలు మంత్రోచ్ఛారణ చేస్తుండగా శేషవాహనంతో పాటు మరో రెండు వాహనాల్లో తీర్థజలాలను ఊరేగించి ఆలయానికి చేర్చారు. 31న ఈ జలాలతో స్వామివారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక క్రతువును నిర్వహించనున్నట్లు వైదిక పెద్దలు తెలిపారు.
న్యూస్టుడే, భద్రాచలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ