వడదెబ్బను తప్పించుకుందాం
జ్వరం, తలనొప్పి, వాంతులతో ఇటీవల ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఎండలో తిరిగే వారికి వడగాల్పులు కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.
ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఆసుపత్రులకు బాధితులు
ఈనాడు, హైదరాబాద్: జ్వరం, తలనొప్పి, వాంతులతో ఇటీవల ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఎండలో తిరిగే వారికి వడగాల్పులు కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. గాంధీ ఆసుపత్రి ఓపీకి నిత్యం ఇలాంటి లక్షణాలతో 200మంది వస్తున్నారు. ఉస్మానియాలోనూ ఇదే పరిస్థితి. రానున్న రోజుల్లో వడదెబ్బ ముప్పు పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు.
లక్షణాలు ఇవి..
* కండరాల తిమ్మిరిః వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
* తీవ్రంగా చెమటలు
* తలనొప్పి, వాంతులు
* అధిక దాహం
* అధిక హృదయ స్పందనలు
* ముదురు రంగులో మూత్రం
ఎవరికి ముప్పు ఎక్కువంటే..
* పిల్లలు, శిశువులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు * అధిక శారీరక శ్రమ చేసేవారు
* గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు
* బీపీ, డిప్రెషన్కు మందులు వాడేవారు
* అతిగా మద్యం తీసుకునేవారు
జాగ్రత్తలు పాటించాలి..
- డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆసుపత్రి
* ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు బయట తిరగకపోవడమే మంచిది. అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే... తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* ముదురు రంగు దుస్తులు కాకుండా తేలికపాటి లేత రంగు దుస్తులను ధరించాలి. ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి.
* ఆల్కాహాల్ శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. ఎండాకాలంలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది.
* ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన నిమ్మరసం లాంటివి శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేస్తాయి. దోసకాయలు, పుచ్చకాయలు, దానిమ్మ, బత్తాయి లాంటి పండ్లు తీసుకోవాలి.
* వేసవిలో తేలికపాటి వ్యాయామాలు ఉదయం 8 గంటల్లోపే ముగించాలి.
* వడదెబ్బ లక్షణాలు కనిపించగానే చికిత్స అందించాలి. లేదంటే శరీరం పూర్తిగా నిర్జలీకరణం చెంది.. బీపీ, పల్స్ పడిపోయి కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ