Tirupati: తిరుపతి జూలో పెద్దపులి పిల్ల మృతి
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కులో పెద్దపులి పిల్ల మృతిచెందింది. కర్నూలు జిల్లా నుంచి ఇటీవల తల్లి నుంచి వేరుపడిన నాలుగు పెద్దపులి పిల్లలను సంరక్షణ కోసం తిరుపతి జూ పార్కుకు రప్పించారు.

తిరుపతి (మంగళం): తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కులో పెద్దపులి పిల్ల మృతిచెందింది. కర్నూలు జిల్లా నుంచి ఇటీవల తల్లి నుంచి వేరుపడిన నాలుగు పెద్దపులి పిల్లలను సంరక్షణ కోసం తిరుపతి జూ పార్కుకు రప్పించారు. వీటిలో ఒకటి మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. సంరక్షణ కోసం తీసుకువచ్చిన పెద్దపులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని ధ్రువీకరించిన తర్వాత సంజీవని రెస్క్యూ హోంకు జూ అధికారులు తరలించారు.
ఇటీవల పులి పిల్లకు జంతు సంరక్షకుడు ఆహారం పెట్టే సమయంలో దాని ముందు కాలు విరిగినట్టు గుర్తించారు. వెంటనే అధికారులు స్పందించి సమీపంలోని వెటర్నరీ కళాశాల నుంచి వైద్యులను రప్పించి విరిగిన కాలికి చికిత్స చేయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన పులి పిల్ల.. మంగళవారం రాత్రి మృతి చెందింది. దీనిపై జూ అధికారులు పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kantara: ‘కాంతార’కు ఏడాది.. నిర్మాణ సంస్థ స్పెషల్ పోస్ట్
-
Vijayawada: విద్యార్థుల అరెస్ట్.. రణరంగంగా మారిన ధర్నా చౌక్
-
Palak Gulia: సరదాగా మొదలుపెట్టి.. షూటింగ్లో స్వర్ణం నెగ్గి
-
45 గంటల బ్యాటరీ లైఫ్తో ₹1699కే నాయిస్ కొత్త ఇయర్బడ్స్.. ఫీచర్లు ఇవే!
-
KTR: ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని చాటారు: కేటీఆర్
-
Chandrababu: చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి సస్పెండ్