అయ్యో.. అన్నదాత
కొనుగోలు కేంద్రం చేతులెత్తేయడంతో నెల రోజులుగా ధాన్యం కుప్ప పోసి ఎదురుచూసిన అన్నదాతల పాట్లు చెప్పనలవి కావు. అకాల వర్షాలు, తూకం వేసిన ధాన్యం తరలింపునకు లారీలు రాకపోవడం వంటి సమస్యలతో తిప్పర్తి
కొనుగోలు కేంద్రం చేతులెత్తేయడంతో నెల రోజులుగా ధాన్యం కుప్ప పోసి ఎదురుచూసిన అన్నదాతల పాట్లు చెప్పనలవి కావు. అకాల వర్షాలు, తూకం వేసిన ధాన్యం తరలింపునకు లారీలు రాకపోవడం వంటి సమస్యలతో తిప్పర్తి కేంద్రం నిర్వాహకులు కొనుగోళ్లు నిలిపేశారు. దీంతో అక్కడికి అమ్మకానికి ధాన్యం తెచ్చి కుప్పలు పోసిన రైతులు గత్యంతరం లేక వాటిని ట్రాక్టర్ ట్రాలీల్లో ఎత్తుకుని రైసుమిల్లులో నేరుగా అమ్మకానికి సిద్ధమయ్యారు. తమ అవసరాన్ని గుర్తించిన రైసుమిల్లు నిర్వాహకులు అడిగిన కాడికి తరుగుకు అంగీకరించాలని, తాము నిర్ణయించిన ధరకు ఒప్పుకుంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామని సతాయిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగైతే పెట్టుబడి కూడా రాదని మొత్తుకుంటే కొనుగోలుకు నిరాకరిస్తున్నారని వాపోతున్నారు. ట్రాక్టరు ట్రాలీల్లో ధాన్యం నింపుకుని వరుసలో ఉంచి కొనుగోలుకు ఎదురుచూపుల్లో నాలుగైదు రోజులు గడుస్తున్నాయని, ట్రాక్టర్ వెయిటింగ్ ఛార్జీలు భారమవుతున్నాయని పేర్కొంటున్నారు. రైసుమిల్లు నిర్వాహకులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములో భద్రపరుస్తున్నారు. అక్కడే ఈ ట్రాక్టర్లు వరుసకట్టి కొనుగోలుకు ఎదురుచూస్తున్నాయి.
ఈనాడు, నల్గొండ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం