CM Jagan Tour: పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?
సీఎం జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా తమ బలం నిరూపించేందుకు.. డ్వాక్రా మహిళల తరలింపు ఇటీవల సర్వసాధారణమైంది.
రాజోలు ఎమ్మెల్యే కుమారుడిని ఆశీర్వదించేందుకు వచ్చిన సీఎం
రోడ్షోకు బస్సుల్లో డ్వాక్రా, అంగన్వాడీ సిబ్బంది తరలింపు
సీఎం జగన్ మధ్యాహ్నం మలికిపురం వస్తున్నారు.. మన గ్రామసంఘంలోని సభ్యులంతా వెళ్లి సీఎంకు థ్యాంక్స్ చెప్పి వద్దాం. ఈ గ్రూపులోని ముసలోళ్లు, గర్భిణులు తప్ప అందరూ రావాలి. ఎవరు రోగులో నాకు తెలుసు. మన సంఘం నుంచి 200 మందిని తీసుకురమ్మని చెప్పారు. అంతకుమించి తెస్తామని చెప్పాం. ఏమైనా సందేహాలుంటే ఫోన్ చేయండి’
రాజోలు నియోజకవర్గంలో ఓ గ్రామసంఘ సభ్యులకు అధ్యక్షురాలు పంపిన సందేశం
ఈనాడు-రాజమహేంద్రవరం, న్యూస్టుడే-పి.గన్నవరం, మలికిపురం: సీఎం జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా తమ బలం నిరూపించేందుకు.. డ్వాక్రా మహిళల తరలింపు ఇటీవల సర్వసాధారణమైంది. జనసేన తరఫున గెలిచిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడు వెంకటరామ్ పెళ్లికి సీఎం జగన్ను ఆహ్వానించడంతో ఆయన బుధవారం మధ్యాహ్నం మలికిపురం వచ్చారు. హెలికాప్టర్ దిగిన తర్వాత సుమారు 1.5 కిమీ మేర రోడ్డుమార్గంలో కత్తిమండలోని వేదిక వద్దకు రావాలి. ఈ మార్గం పొడవునా డ్వాక్రా మహిళలను, అంగన్వాడీ సిబ్బందిని బలవంతంగా తీసుకువచ్చి వారి చేతికి ‘థాంక్యూ సీఎం సార్’.. ‘మా నమ్మకం నువ్వే జగన్’ తదితర ప్లకార్డులు ఇచ్చి స్వాగతం పలకాలని అధికారులు హుకుం జారీచేశారు. ఎండలో వచ్చిన వారంతా... ఎమ్మెల్యే ఇంట వేడుకైతే తమకెందుకు ఈ తిప్పలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహవేదిక నుంచి తిరిగి హెలిప్యాడ్ వద్దకు సీఎం వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే అంతా తిరుగుముఖం పట్టారు.
* సీఎం వస్తున్నారని ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సుమారు 1.50 కి.మీ మేర రోడ్డుకు ఇరువైపులా ఇనుప బారికేడ్లు ఏర్పాటుచేయడంతో దుకాణాలు మూసేశారు.
* సాయత్రం 3.44కు మలికిపురం చేరుకున్న సీఎం జగన్ వేదిక వద్దకు వెళ్లి వధూవరులు తన్మయి, వెంకటరామ్ను ఆశీర్వదించారు. అయిదు నిమిషాల తర్వాత హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. 40 నిమిషాల పాటు పలువురు దివ్యాంగులు, అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. 5.40కి తాడేపల్లికి పయనమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM