అందని బిల్లులు.. అప్పులతో తిప్పలు
ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న నిర్వాహకులకు కొన్ని నెలలుగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మధ్యాహ్న భోజనం నిర్వాహకుల ఇబ్బందులు
జనగామ ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న నిర్వాహకులు (పాతచిత్రం)
జనగామ అర్బన్, న్యూస్టుడే: ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న నిర్వాహకులకు కొన్ని నెలలుగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ మహిళలు అప్పులు తెచ్చి పిల్లల ఆకలి తీర్చుతున్నారు.
పెరిగిన ధరలతో అవస్థలు..
నిత్యావసర సరకుల ధరలు పెరగడంతో నిర్వాహకులు ఆర్థికభారంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే దాని కంటే వెచ్చించే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4.97 (గుడ్డుతో కాకుండా), ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్కొక్కరికి రూ.8.17 (గుడ్డు మినహాయించి) చొప్పున, 9, 10 తరగతుల్లో ఒక్కో విద్యార్థికి గుడ్డుతో కలుపుకొని రూ.10.67 వంతున చెల్లిస్తున్నారు. గత రెండేళ్లుగా నిత్యావసరాలు, కూరగాయలు, వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. అప్పులు చేసి వంట చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలతో సతమతం..!
ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రావడం లేదు. ఇచ్చే అరకొర వేతనాలు కూడా సమయానికి అందడం లేదు. మరోవైపు నిర్వాహకులు భోజనం తయారీకి దొరికిన చోటల్లా అప్పులు చేశారు. తెచ్చిన అప్పులు, సరుకులపై వ్యాపారులు వడ్డీలు వేస్తున్నారు. దీంతో వాటిని చెల్లించడం పెద్ద సమస్యగా మారింది. రోజూ కూలి పనులకు వెళ్తే రూ.500 వరకు వస్తుంటే.. కేవలం రూ.1000 వేతనానికి పని చేయడం కష్టంగా మారిందని, కిచెన్ షెడ్లు లేక ఆరుబయటే కట్టెలపొయ్యి మీద వంట చేయడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు నెలలకు సంబంధించి లక్షలాది రూపాయల భోజన బిల్లుల బకాయిలు రావాల్సి ఉంది. ఎన్ని ఇబ్బందులున్నా పిల్లల కడుపు మాడ్చకుండా భోజనం పెడుతున్న నిర్వాహకులకు బిల్లులు త్వరగా విడుదల చేయాలని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి
- జనగామలోని ఓ ఉన్నత పాఠశాలలో 380 మంది విద్యార్థులకు ముగ్గురు నిర్వాహకులు వంట చేస్తున్నారు. ఇందు కోసం నెలకు సుమారు రూ.50వేలకు పైగా ఖర్చవుతోంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం నెలకు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు బిల్లులు వస్తుండడంతో నిర్వాహకులు నష్టపోతున్నారు.
- మరో ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు భోజనం వండి పెడుతున్న నిర్వాహకురాలికి రోజుకు సుమారు రూ.200 చొప్పున లెక్కిస్తే ఆమెకు రూ.50 కూడా బిల్లు రావడం లేదు.
- పాలకుర్తి, రఘునాథపల్లి, తరిగొప్పుల మండలాల్లోని కొన్ని పాఠశాలల్లో వంట భారంగా మారడంతో నిర్వాహకులు వంట చేసేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం.
అప్పులు తెచ్చి వంట చేస్తున్నాం
ఆదిలక్ష్మి, వంట నిర్వాహకురాలు, జనగామ
మూడు నెలలుగా మధ్యాహ్న భోజనం బిల్లులు ఇవ్వడం లేదు. ఇచ్చే బిల్లులను కూడా సకాలంలో అందించకపోవడంతో అప్పులు తెచ్చి పిల్లలకు భోజనం పెట్టాల్సి వస్తోంది. వంట చేస్తే రోజుకు రూ.50 కూలి పడుతోంది. అదే బయటి పనులకు వెళ్తే రోజుకు రూ.250 పడుతోంది. ప్రభుత్వం ఇచ్చే బిల్లులు గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం స్పందించి సకాలంలో బిల్లులు చెల్లించాలి. నిత్యావసర ధరలు పెరిగినందున ఒక్కో విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచాలి.
ఏప్రిల్ వరకు వచ్చాయి
గౌతమ్రాజు, ఎండీఎం ఇన్ఛార్జి
మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు ఏప్రిల్ వరకు బిల్లులు చెల్లించాం. నాలుగు నెలలకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే విడుదల కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు.. -
Chandrababu: ఐఆర్ఆర్ కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెదేపా అధినేత చంద్రబాబుు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. -
Cyclone: ఏపీకి తుపాను ముప్పు.. మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
Hyderabad: జగన్ అక్రమాస్తుల కేసు.. 127 డిశ్చార్జ్ పిటిషన్లపై కొలిక్కి వచ్చిన వాదనలు
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. -
YS Bhaskarreddy: సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్ భాస్కర్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్ భాస్కర్రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు. -
Nagarjunasagar: సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణలో సాగర్ డ్యామ్: కేంద్రం హోంశాఖ నిర్ణయం
నాగార్జున సాగర్ జలాల విడుదలపై ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదంపై కేంద్ర హోం శాఖ స్పందించింది. -
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు.. -
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
నాగార్జునసాగర్ కుడి కాలువ (Nagarjuna Sagar right canal) నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. -
TTD: వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు: ఈవో ధర్మారెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Cyclone Michaung: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
Nagarjuna Sagar: సాగర్ వద్ద కొనసాగుతున్న పహారా.. ఏపీ పోలీసులపై కేసు నమోదు
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. -
గ్రానైట్పై విద్యుత్తు పిడుగు
‘బాపట్ల జిల్లా మార్టూరులో 400, బల్లికురవలో 200, సంతమాగులూరులో 90, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 120, ప్రకాశం జిల్లాలో 800 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.’ -
‘అన్ని మండలాల్లోనూ కరవు’
జిల్లావ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొందని, తక్షణం అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
UGC: యూనివర్సిటీలు, కాలేజీల్లో సెల్ఫీ పాయింట్లు పెట్టండి..!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Mizoram Elections: మిజోరం ఓట్ల లెక్కింపు తేదీ మార్పు
-
Revanth reddy: అన్ని ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలి: రేవంత్రెడ్డి
-
IND vs SA: అతడికి ఓ లాలీపాప్ ఇచ్చారు.. చాహల్ను వన్డేలకు ఎంపిక చేయడంపై హర్భజన్
-
Telsa: టెస్లాకు ప్రత్యేక మినహాయింపులు ఉండవ్!