సీఎం జగన్కు రాజధాని రైతుల సెగ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గురువారం ఉదయం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది.
రైతులు, మహిళలను అడ్డుకుంటున్న పోలీసులు
తుళ్లూరు, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గురువారం ఉదయం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. శాసనసభ సమావేశాలకు ఆయన వెలగపూడిలోని సచివాలయానికి వెళుతున్న సమయంలో శిబిరం వద్ద అన్నదాతలు జెండాలు, ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు. ‘రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి’, ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు దీక్ష శిబిరం నుంచి ఆందోళనకారులు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు అన్నదాతలు మాట్లాడుతూ 1374 రోజులుగా న్యాయం కోరుతూ నిరసనలు చేస్తున్నా ముఖ్యమంత్రి కనీసం తమ వైపు చూడటానికి కూడా ఇష్టపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు భూములు ఇచ్చిన తమకు కౌలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయటం దారుణమన్నారు. పిల్లలకు స్కూల్ ఫీజులు, ఆరోగ్య అవసరాలు, కుటుంబ పోషణ కష్టంగా మారిందని వాపోయారు. ఎన్నికల ముందు మీ బిడ్డలాంటి వాడిని ఒక్క చాన్స్ ఇవ్వండని అడిగిన జగన్.. అధికార పీఠం ఎక్కిన తర్వాత కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక విమానాల్లో పర్యటనలు చేయటానికి అప్పు దొరుకుతున్నప్పుడు.. కౌలు డబ్బులు ఇచ్చేందుకు దొరకడం లేదా అంటూ ప్రశ్నించారు. అమరావతి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుపై ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోక పోతే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
సీఎం కాన్వాయ్ వెళ్తుండగా రైతులు, మహిళల నినాదాలు
‘చంద్రబాబు అరెస్టు వెనుక భారీ కుట్ర’
విభజన అనంతరం ఏర్పడిన నూతన రాష్ట్రాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధితో పరుగులు పెట్టించారు. అటువంటి నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులతో వేధించటం దారుణం. విజన్ 2020 అంటే అప్పట్లో నాయకులు విమర్శలు చేశారు. దాన్ని ఆచరణలో చంద్రబాబు నిజం చేశారు. ఆయన కృషితోనే హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెందింది. ఆయన అరెస్టు వెనుక భారీ కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది. ఆయనకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా ప్రభుత్వానిదే బాధ్యత.
కామినేని గోవిందమ్మ, రాజధాని మహిళా రైతు, తుళ్లూరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Hyderabad: జగన్ అక్రమాస్తుల కేసు.. 127 డిశ్చార్జ్ పిటిషన్లపై కొలిక్కి వచ్చిన వాదనలు
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. -
YS Bhaskarreddy: సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్ భాస్కర్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్ భాస్కర్రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు. -
Nagarjunasagar: సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణలో సాగర్ డ్యామ్: కేంద్రం హోంశాఖ నిర్ణయం
నాగార్జున సాగర్ జలాల విడుదలపై ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదంపై కేంద్ర హోం శాఖ స్పందించింది. -
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు.. -
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
నాగార్జునసాగర్ కుడి కాలువ (Nagarjuna Sagar right canal) నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. -
TTD: వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు: ఈవో ధర్మారెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Cyclone Michaung: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
Nagarjuna Sagar: సాగర్ వద్ద కొనసాగుతున్న పహారా.. ఏపీ పోలీసులపై కేసు నమోదు
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. -
గ్రానైట్పై విద్యుత్తు పిడుగు
‘బాపట్ల జిల్లా మార్టూరులో 400, బల్లికురవలో 200, సంతమాగులూరులో 90, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 120, ప్రకాశం జిల్లాలో 800 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.’ -
‘అన్ని మండలాల్లోనూ కరవు’
జిల్లావ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొందని, తక్షణం అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: జగన్ అక్రమాస్తుల కేసు.. 127 డిశ్చార్జ్ పిటిషన్లపై కొలిక్కి వచ్చిన వాదనలు
-
Viral news: ఇదేం పెళ్లిరా బాబూ.. తుపాకీ ఎక్కుపెట్టి.. తాళి కట్టించి..!
-
టాప్గేర్లో టూవీలర్ విక్రయాలు.. ఏ కంపెనీ ఎన్నంటే?
-
Maharashtra: అజిత్ పవార్కు భాజపా సుపారీ.. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి సంచలన ఆరోపణలు
-
PM Modi: భారత్లో కాప్-33 సదస్సు.. దుబాయ్లో ప్రతిపాదించిన మోదీ
-
YS Bhaskarreddy: సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్ భాస్కర్రెడ్డి