డ్రైవర్ల కొరత.. పనిభారంతో కలత
జిల్లాలోని శ్రీకాళహస్తి డిపోలో డ్రైవర్ల కొరత పట్టిపీడిస్తోంది. ఫలితంగా విధుల్లో ఉన్న వారిపై అదనపు పనిభారం మోపుతున్నారు.
అదనపు ట్రిప్పులతో ఒత్తిడి
తిరుపతి (ఆర్టీసీ), న్యూస్టుడే: జిల్లాలోని శ్రీకాళహస్తి డిపోలో డ్రైవర్ల కొరత పట్టిపీడిస్తోంది. ఫలితంగా విధుల్లో ఉన్న వారిపై అదనపు పనిభారం మోపుతున్నారు. అదనపు ట్రిప్పులు, టిమ్ విధులంటూ ఒత్తిడికి గురిచేస్తున్నారని పలువురు డ్రైవర్లు వాపోతున్నారు. ప్రశ్నించే వారికి మెమోలు జారీ చేస్తామంటూ డిపో స్థాయి అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఆదివారం ఇదే డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ ధనరాజు.. ఒత్తిడితోనే మృతి చెందారంటూ సహ ఉద్యోగులు, బంధువులు డిపో ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
ఏపీఎస్ఆర్టీసీ జిల్లా పరిధిలో మొత్తం 11 డిపోలు ఉండగా, అందులో శ్రీకాళహస్తి ఒకటి. ఇక్కడ 103 బస్సులకు ఘాట్రోడ్డు సర్వీసులు (తిరుమల- తిరుపతి)- 25, తిరుపతి- శ్రీకాళహస్తి (నాన్- స్టాప్ మెట్రో)- 25, మిగిలిన బస్సుల్లో సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు సర్వీసులున్నాయి. అన్ని బస్సులకు 200 మంది డ్రైవర్లు ఉండాలి. 70 మంది కొరత ఉన్నట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో ఆన్కాల్ డ్రైవర్ల(రోజువారీ వేతనం)ను నియమించుకుంటున్నారు. వీరు ఒకరోజు వస్తే మరో రోజు రారు. దీంతో రెగ్యులర్ డ్రైవర్లపై పనిభారం పడుతోందని, కనీస అవసరాలకు అధికారిక సెలవులు పెట్టుకునే అవకాశం కూడా లేదని వారు వాపోతున్నారు.
ఒత్తిడి పెంచుతున్నారిలా..
తిరుమల- తిరుపతి, తిరుపతి- శ్రీకాళహస్తి సర్వీసులు నడిపే డ్రైవర్లకు అదనపు విధులతో ఒత్తిడి పెంచుతున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా తిరుమల- తిరుపతి సర్వీసులు డిపో నుంచి తిరుపతికి ఒక ట్రిప్పు వచ్చి తిరుమలకు ఐదు ట్రిప్పులు నడిపి, తిరిగి శ్రీకాళహస్తి డిపోకు చేరుకోవాలి. శని, ఆదివారాలు భక్తుల రద్దీ దృష్ట్యా అదనంగా ఒక ట్రిప్పు కలిపి మొత్తం ఆరు ట్రిప్పులు తిరగాలి. ఇలా పూర్తిచేసి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి డ్రైవర్కు ఒకటిన్నర రోజు పడుతుంది. డ్యూటీ దిగిన డ్రైవరు అదేరోజు మిగిలిన సగం రోజు విశ్రాంతి తీసుకొని, తిరిగి మరుసటిరోజు ఉదయాన్నే విధులకు హాజరు కావాలి. అలాగే తిరుపతి- శ్రీకాళహస్తి మధ్య డ్రైవర్లు మొత్తం ఆరు ట్రిప్పులు నడపాల్సి ఉండగా, ప్రస్తుతం ఆ మార్గంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్కు అంతరాయం. ఈ లెక్కన ఉదయం 9 గంటలకు విధులకు వచ్చిన డ్రైవరు ఆరు ట్రిప్పులు ముగించుకునే సరికి తిరిగి మరుసటి రోజు ఉదయం 8 గంటలు అవుతుంది. అంటే 24 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి. సంస్థ ఆదాయం చూస్తుందే తప్ప డ్రైవర్ల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
ప్రశాంత విధులు కేటాయించాలి
డ్రైవర్లకు ప్రశాంతమైన విధులు కేటాయించాల్సిన అవసరం. వారిని మానసికంగా ఒత్తిడికి గురిచేయడం అధికారులకు సరికాదు. తద్వారా ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఒత్తిడి లేని విధులు కేటాయించాలి.
బి.ఎస్.బాబు, ఎన్ఎంయూఏ జిల్లా కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
నాగార్జునసాగర్ కుడి కాలువ (Nagarjuna Sagar right canal) నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. -
TTD: వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు: ఈవో ధర్మారెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Cyclone Michaung: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
Nagarjuna Sagar: సాగర్ వద్ద కొనసాగుతున్న పహారా.. ఏపీ పోలీసులపై కేసు నమోదు
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. -
గ్రానైట్పై విద్యుత్తు పిడుగు
‘బాపట్ల జిల్లా మార్టూరులో 400, బల్లికురవలో 200, సంతమాగులూరులో 90, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 120, ప్రకాశం జిల్లాలో 800 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.’ -
‘అన్ని మండలాల్లోనూ కరవు’
జిల్లావ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొందని, తక్షణం అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్పై రూ.21 పెంపు
-
KCR: డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ
-
CBSE: 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: బోర్డు
-
Rishab Shetty: నేను చెప్పింది ఇప్పటికి అర్థం చేసుకున్నారు.. తన స్పీచ్పై రిషబ్ శెట్టి పోస్ట్
-
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు