Jharkhand: దయ్యాలకు ఓ జాతర ఉంది.. అదెక్కడో చూద్దామా..!
మీరు ఇప్పటి వరకూ కుంభ మేళ, ఉద్యోగ మేళ, ఫుడ్ మేళాల గురించి విని ఉంటారు. కానీ ఇప్పుడు మీరు వినబోయేది గతంలో ఎప్పుడూ వినని మేళా. అదే భూత్ మేళా
మీరు ఇప్పటి వరకూ కుంభ మేళ, ఉద్యోగ మేళ, ఫుడ్ మేళాల గురించి విని ఉంటారు. కానీ ఇప్పుడు మీరు వినబోయేది గతంలో ఎప్పుడూ వినని మేళా. అదే భూత్ మేళా. అది ఝార్ఖండ్ రాష్ట్రం పాలము జిల్లాలోని హైదర్నగర్ ప్రాంతం.. సమయం మిట్టమధ్యాహ్నం.. ఎండ మండిపోతోంది.. అక్కడ చూస్తే పిడకలతో వేసిన మంటల ముందు కొందరు దయ్యం పట్టిన వారిలా ఊగిపోతున్నారు. దయ్యాలను వదిలించేందుకు కొందరు పూజలు చేస్తున్నారు. తమకు దయ్యం పట్టిందని భావించే వారు అక్కడ వందల మంది ఉన్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వారు ఎక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే అక్కడ భూత్ మేళా జరుగుతోంది మరి. ఔను మీరు విన్నది నిజమే అక్కడ జరుగుతున్నది దయ్యాల జాతర. ఇక్కడ కొన్ని దశాబ్ధాల కాలంగా భూత్ మేళా జరుగుతోంది. తమకు దయ్యాలు పట్టాయని భ్రమ పడేవారు, తమకు కీడు సోకిందని తలించే వారు వేలాదిగా తరలి వస్తారు. ఛైత్రీ నవరాత్రుల సమయంలో ఈమేళా నిర్వహిస్తారు. పాలముతో పాటు గర్వ, లతేహా, ఛత్ర ప్రాంతాలు ఈ దయ్యాల జాతరకు ఫేమస్. దేశం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తారు. బీహార్, బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది తమ కుటుంబ సభ్యలను తీసుకుని వస్తుంటారు. దయ్యాలను వదిలించే పూజలు చేసే వారు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటారు. ప్రజలు భారీగా తరలి వచ్చినపుడు పోలీసు బందోబస్తు సైతం ఏర్పాటు చేస్తారు. సందర్శకుల కోసం మౌలిక సదుపాయాలు సైతం కల్పించడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్