Water Issue: పెద్దవాగు ప్రాజెక్టును జీఆర్ఎంబీలోకి తెచ్చేందుకు రంగం సిద్ధం
పెద్దవాగు ప్రాజెక్టును గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు గోదావరి బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు సుముఖత తెలిపాయి. బోర్డు పరిధిలోకి తెలంగాణ రాష్ట్రంలోని ...
హైదరాబాద్: పెద్దవాగు ప్రాజెక్టును గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు గోదావరి బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు సుముఖత తెలిపాయి. బోర్డు పరిధిలోకి తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులను తీసుకురావాలని ఏపీ కోరగా.. సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తీసుకోవాలని తెలంగాణ కోరింది. గెజిట్ నోటిఫికేషన్లో ప్రాజెక్టుల స్వాధీనం ఎక్కడా లేదన్న తెలంగాణ అధికారులు.. రాష్ట్రాలు అప్పగిస్తేనే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తాయని స్పష్టం చేశారు. బోర్డు కేవలం.. పర్యవేక్షణ, నియంత్రణ మాత్రమే చూసుకుంటుందని ఛైర్మన్ చెప్పారని వెల్లడించారు.
గెజిట్ అమలు సహా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకురావడమే ప్రధాన అజెండాగా హైదరాబాద్లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేకంగా సమావేశమైంది. జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి బోర్డు సభ్యులు, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలుచేయాల్సి ఉన్న నేపథ్యంలో ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగు మధ్య తరహా ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకువచ్చే విషయమై సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించి ఉపసంఘం ఇచ్చిన నివేదికపై బేటీలో చర్చించారు. ప్రయోగాత్మకంగా పెద్దవాగు ప్రాజెక్టు నుంచి గెజిట్ అమలు చేస్తామని గోదావరి బోర్డు తెలిపింది. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాలు తగిన సమాచారంతో పాటు వివరాలు అందించడం సహా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరింది. పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకునే విషయమై రెండు రాష్ట్రాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ కోరగా.. ఏపీ విభేదించింది. గెజిట్ నోటిఫికేషన్లో ప్రాజెక్టుల స్వాధీనం అని ఎక్కడా లేదన్న తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ రాష్ట్రాలు అప్పగిస్తేనే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తాయన్నారు.
పెద్దవాగుతో పాటు తెలంగాణలో గోదావరిపై ఉన్న ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. లీవ్ పిరియడ్లో గోదావరి దిగువకు పెద్దగా జలాలు రావడం లేదని ఆ సమయంలో తెలంగాణ చెరువులకు నీటిని మళ్లిస్తోందని ఏపీ అధికారులు తెలిపారు. దీంతో ఏపీకి తాగునీటి సమస్య వస్తుందని, బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు శ్యామలరావు తెలిపారు. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వస్తున్న తరుణంలో పెద్దవాగు ప్రాజెక్టు నుంచి ప్రారంభిస్తున్నట్టు గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయమై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మంగళవారం సమావేశం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!