AP News: ఏపీలో వృద్ధాప్య పింఛను పెంపు

ఏపీలో పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్త ఏడాదిలో వృద్ధాప్య పింఛను పెంచుతూ....

Updated : 14 Dec 2021 17:10 IST

అమరావతి: ఏపీలో పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్త ఏడాదిలో వృద్ధాప్య పింఛను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలనెలా ₹2,250ల చొప్పున పింఛను ఇస్తుండగా.. ఇకపై దాన్ని ₹2,500లకు పెంచి ఇవ్వనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలుచేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన ‘స్పందన’ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నిర్ణయాలను వెల్లడించారు.

జనవరిలోనే రైతు భరోసా సాయం

అలాగే, డిసెంబర్‌, జనవరిలలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను సీఎం వెల్లడించారు. ఈ నెల 21న సంపూర్ణ గృహహక్కు పథకం ప్రారంభించనున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా అగ్రవర్ణ నిరుపేద మహిళలకు లబ్ధి చేకూర్చనున్నారు. 45 నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళలకు మూడేళ్లలో ₹45వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే, జనవరిలోనే రైతు భరోసా సాయం ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. రైతు భరోసా సాయం తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని