Andhra News: విశాఖ-విజయవాడ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్‌..

విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్‌ రైలు కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

Updated : 23 Jan 2023 19:18 IST

కాకినాడ: ఏపీలోని కాకినాడ జిల్లా పిఠాపురం- సామర్లకోట వద్ద ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విశాఖ నుంచి విజయవాడ మార్గంలో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యశ్వంత్‌పూర్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు నిలిపివేశారు.

సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. దాదాపు మూడు గంటలపాటు ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖవైపు వెళ్లే రైళ్లు 1.30 గంటల నుంచి రెండు గంటల ఆలస్యం కాగా.. విజయవాడ వైపు వెళ్లే రైళ్లు 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని