దివీస్కు ఏపీ సర్కార్ లేఖ
స్థానికుల జీవనాధారంపై ప్రభావం చూసే వ్యర్థాలను విడుదల చేయొద్దని తూర్పుగోదావరి జిల్లాలోని దివీస్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దివీస్ పరిశ్రమ కాలుష్యంపై
అమరావతి: స్థానికుల జీవనాధారంపై ప్రభావం చూసే వ్యర్థాలను విడుదల చేయొద్దని తూర్పుగోదావరి జిల్లాలోని దివీస్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దివీస్ పరిశ్రమ కాలుష్యంపై వివాదం నెలకొనడంతో ఈ మేరకు సంస్థకు ప్రభుత్వం లేఖ రాసింది. పరిశ్రమకు స్థలం ఇచ్చిన ప్రాంతంలో ఆక్వా హేచరీలు ఉన్నాయని పరిశ్రమల డైరెక్టర్ జేవీఎన్ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. హేచరీలు నష్టపోతే వీటి కారణంగా పెద్ద ఎత్తున ఉపాధి పొందిన గ్రామీణ యువత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రావొచ్చని లేఖలో పేర్కొన్నారు. వ్యర్థాల కారణంగా యువత ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల కాలుష్య నివారణ చర్యలు చేపట్టకుండా వ్యర్థాలను విడుదల చేయడం సరికాదని లేఖలో స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..
తూర్పుగోదావరిలో పవన్ పర్యటన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..