AP News: నాలుగు నెలల్లో 2లక్షల మంది పింఛన్లు కట్
సామాజిక పింఛన్ల జాబితాలో కోత పెట్టడంపై లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. వృద్ధ్యాప్య ఫించన్లతోపాటు వికలాంగ పెన్షన్లలోనూ కోత విధించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక పింఛన్ల జాబితాలో కోత పెట్టడంపై లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. వృద్ధ్యాప్య ఫించన్లతోపాటు వికలాంగ పెన్షన్లలోనూ కోత విధించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అనర్హుల పేరిట పింఛన్ల సంఖ్యలో కోత వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 51 కోట్ల రూపాయలు మిగుల్చుకుంటున్నట్టు తెలుస్తోంది. పింఛన్ల తొలగింపుపై లబ్ధిదారులతోపాటు రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఓ వైపు తమది సంక్షేమ ప్రభుత్వమంటూ చెప్పుకొస్తున్న సర్కారు.. ఏకంగా లక్షల సంఖ్యలో పింఛన్లను తొలగించడంపై లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన రెండు నెలలుగా సామాజిక తనిఖీల పేరుతో వేలిముద్రలు వేయించుకొని.. తీరా పింఛన్లు తొలగించడాన్ని లబ్ధిదారులు ఆక్షేపిస్తున్నారు. గతంతో పోలిస్తే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వృద్ధాప్య, దివ్యాంగ, ఇతర సామాజిక భద్రత పింఛన్లు గణనీయంగా తగ్గాయి. 2021 జూన్ నుంచి సామాజిక భద్రత పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లలోనూ ఎక్కువగా కోతలు పడ్డాయి. జూన్లో పంపిణీ చేసిన పింఛన్లతో పోలిస్తే సెప్టెంబరు నాటికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. దాదాపుగా 2.28 లక్షల లబ్ధిదారులకు పింఛన్లను ప్రభుత్వం తొలగించింది. జూన్లో 61.46 లక్షల మందికి పింఛన్లను పంపిణీ చేస్తే.. జులైలో ఆ సంఖ్య 60.95 లక్షలకు తగ్గింది. వివిధ కారణాలతో ఇదే నెలలో దాదాపు 51 వేల మంది పింఛన్లను తొలగించారు.
ఆగస్టులో లబ్ధిదారుల సంఖ్యలో మరింత కోత పడింది. ఆ నెలలో 60.50 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా 45 వేల మందికి పింఛన్లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేలిముద్ర పడకపోవడం, ఆదాయ పన్ను చెల్లింపులు ఇతర రాష్ట్రాల్లో నివాసముంటున్నారంటూ వివిధ కారణాలతో పింఛన్లను తొలగించారు. ఈ ఏడాది సెప్టెంబరులో పింఛను తీసుకునే అర్హుల సంఖ్య 59.18 లక్షలుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు 2.28 లక్షల మంది లబ్ధిదారులను పింఛన్ల జాబితా నుంచి తొలగించారు. గత మూడు నెలలుగా తనిఖీలు నిర్విహించి.. అనర్హులంటూ లక్షల సంఖ్యలో పింఛన్లను తొలగించడంతో లబ్ధిదారులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిస్సహాయులమైన తమకు పింఛన్లను పునరుద్ధరించాలంటూ జిల్లా కలెక్టర్ల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్