Telangana news: యువత చదువుతో పాటు వారి చరిత్ర తెలుసుకోవాలి: తమిళి సై

యువత చదువుతోపాటు దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన యోధుల చరిత్రనూ తెలుసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌

Updated : 08 Aug 2022 17:23 IST

హైదరాబాద్‌: యువత చదువుతోపాటు దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన యోధుల చరిత్రనూ తెలుసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఆమె సోమవారం సాలార్ జంగ్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఛాయచిత్ర ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 38 మంది స్వాతంత్ర్య పోరాటయోధుల చరిత్రను ఈ ప్రదర్శనలో సంక్షిప్త వివరాలతో ఏర్పాటు చేసిన ఫొటోలను పరిశీలించిన గవర్నర్.. జాతీయ జెండా రూపకల్పనలో కృషి చేసిన సిస్టర్ నివేదిత, డాక్టర్ అనిబిసెంట్, పింగళి వెంకయ్య సేవలను కొనియాడారు. సాలార్ జంగ్ మ్యూజియంను సందర్శించే వారిలో ఈ ప్రదర్శన దేశభక్తిని పెంపొందిస్తుందన్నారు. గతంలో ఏడాదిలో ఒక్కరోజే జెండా పండుగ వచ్చేదని, ఇప్పుడు ఏడాదంతా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే అదృష్టం కలిగిందంటూ తమిళి సై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో భారత వ్యోమగామి రాకేశ్ శర్మ, స్టార్ షెట్లర్ పీవీ సింధు ఛాయాచిత్రాలు కూడా ప్రదర్శించడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని