Telangana news: యువత చదువుతో పాటు వారి చరిత్ర తెలుసుకోవాలి: తమిళి సై
యువత చదువుతోపాటు దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన యోధుల చరిత్రనూ తెలుసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
హైదరాబాద్: యువత చదువుతోపాటు దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన యోధుల చరిత్రనూ తెలుసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆమె సోమవారం సాలార్ జంగ్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఛాయచిత్ర ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 38 మంది స్వాతంత్ర్య పోరాటయోధుల చరిత్రను ఈ ప్రదర్శనలో సంక్షిప్త వివరాలతో ఏర్పాటు చేసిన ఫొటోలను పరిశీలించిన గవర్నర్.. జాతీయ జెండా రూపకల్పనలో కృషి చేసిన సిస్టర్ నివేదిత, డాక్టర్ అనిబిసెంట్, పింగళి వెంకయ్య సేవలను కొనియాడారు. సాలార్ జంగ్ మ్యూజియంను సందర్శించే వారిలో ఈ ప్రదర్శన దేశభక్తిని పెంపొందిస్తుందన్నారు. గతంలో ఏడాదిలో ఒక్కరోజే జెండా పండుగ వచ్చేదని, ఇప్పుడు ఏడాదంతా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే అదృష్టం కలిగిందంటూ తమిళి సై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో భారత వ్యోమగామి రాకేశ్ శర్మ, స్టార్ షెట్లర్ పీవీ సింధు ఛాయాచిత్రాలు కూడా ప్రదర్శించడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్