ప్రజా చైతన్యంతోనే కొవిడ్ కట్టడి: తమిళిసై
వెంటిలేటర్లు, ఔషధాలు, ఆక్సిజన్ ఎంత సమకూర్చినప్పటికీ ప్రజా చైతన్యంతోనే కొవిడ్ మహమ్మారిని నియంత్రించగలమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్: వెంటిలేటర్లు, ఔషధాలు, ఆక్సిజన్ ఎంత సమకూర్చినప్పటికీ ప్రజా చైతన్యంతోనే కొవిడ్ మహమ్మారిని నియంత్రించగలమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కరోనా నివారణ పద్ధతులు, వ్యాక్సినేషన్పై మరింత అవగాహన పెంచేందుకు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు ఆమె సూచించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఉన్నత విద్యాశాఖాధికారులతో పుదుచ్చేరి నుంచి గవర్నర్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
కొవిడ్ ఉద్ధృతమవుతున్న సందర్భంలో ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించడం అత్యంత ఆవశ్యకమన్నారు. సరైన విధంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, గుంపులుగా గుమిగూడకుండా ఉండటం లాంటివి కరోనా నివారణ, నియంత్రణలో అత్యంత కీలకమని తమిళిసై స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లోని ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు, రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలను ఈ దిశగా వినియోగించుకోవాలని సూచించారు. కరోనా బారిన పడుతున్న వారిలో దాదాపు 40 శాతం మంది యువకులే ఉండడం ఎంతో బాధ కలిగిస్తోందన్నారు. వినూత్న పద్ధతుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. విశ్వవిద్యాలయాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
ఆన్లైన్ తరగతులు, పరీక్షలు జరుగుతున్న తీరును తమిళిసై సమీక్షించారు. ఆన్లైన్ క్లాసులు అందుకోలేకపోయిన విద్యార్థుల కోసం డిజిటల్ రిసోర్సెస్ సిద్ధం చేయాలని ఆదేశించారు. పూర్వ విద్యార్థుల నెట్వర్క్ రూపొందించడంతో పాటు వారిని ఛాన్స్లర్ కనెక్ట్ అల్యూమ్నిలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యాసంస్థల్లో చేపట్టిన కొవిడ్ నియంత్రణ చర్యలు, ఆన్లైన్ విద్యాబోధన, సంబంధిత చర్యలను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గవర్నర్కు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం