Indian Constitution:‘భారత రాజ్యాంగం’పై కేంద్రం ఉచిత కోర్సు!
భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉచిత ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. నేడు ‘భారత రాజ్యంగ దినోత్సవం’ పురస్కరించుకొని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘అజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా ఈ కోర్సును
దిల్లీ: భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉచిత ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. నేడు ‘భారత రాజ్యంగ దినోత్సవం’ పురస్కరించుకొని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు వెల్లడించారు.
ఈ ఉచిత ఆన్లైన్ కోర్సును కేంద్ర న్యాయ వ్యవహారాల విభాగం, కేంద్ర న్యాయశాఖ, నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్(నల్సార్), హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ లా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సంయుక్తంగా అందిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ కోర్సులో చేరే అవకాశముంది. ఆసక్తిగలవారు www.legalaffairs.nalsar.ac.in వెబ్సైట్లో తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సులో చేరిన అభ్యర్థులకు వెబ్సైట్లో 15వీడియోలు చూసేందుకు అనుమతిస్తారు. వాటిలో భారత రాజ్యాంగానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. అంతేకాదు.. రాజ్యాంగ రచన, అమలు, తర్వాత చోటుచేసుకున్న పరిణామ క్రమాన్ని వివరిస్తారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఆటోమెటిక్గా సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. అయితే, ఆ సర్టిఫికేట్ పొందాలంటే నామమాత్రపు ఫీజుగా రూ. 100 చెల్లించాలి.
► Read latest General News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ (సెషన్-2) ఫలితాలు వచ్చేశాయ్..
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM