AP News: అరుదైన జీవులను కాపాడుకుందాం..
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో నివసించే అరుదైన జీవులు సముద్ర తాబేళ్లు. మానవాళికి మేలుచేసే సముద్ర జీవుల్లో తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కృష్ణా నది బంగాళాఖాతంలో....
అంతరించిపోయే ప్రమాదంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు
అవనిగడ్డ: కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో నివసించే అరుదైన జీవులు సముద్ర తాబేళ్లు. మానవాళికి మేలుచేసే సముద్ర జీవుల్లో తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే సాగర సంగమం వద్ద వేలాదిగా ఇవి జీవిస్తున్నాయి. సముద్ర కాలుష్యం, ఇతర కారణాల వల్ల అంతరించిపోతున్న ఈ తాబేళ్లను సంరక్షించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
భూమి మీద ఉన్న అతి ప్రాచీనమైన సరీసృపాలు సముద్ర తాబేళ్లు. వీటి జీవితకాలం 100 నుంచి 150 ఏళ్లు. ఇవి సముద్ర సంచార జీవులు. ఆహారం, గుడ్లు పెట్టడం కోసం సుమారు 20 వేల కిలోమీటర్ల వరకు వలస వెళుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడు రకాల సముద్ర తాబేళ్ల జాతులున్నాయి. వీటిలో ఐదు రకాలు భారతదేశంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఎక్కువగా వచ్చేవి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు. ఈ సముద్ర తాబేలు ఒకేసారి 90 నుంచి 165 గుడ్లు పెడుతుంది. కాగా పదేళ్లకోసారి ఇక్కడకు వచ్చి గుడ్లు పెట్టి తమ సంతతిని పెంపొందించుకోవడం వీటి ప్రత్యేకత.
అటవీశాఖ అవనిగడ్డ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారుల కృషితో ప్రభుత్వం సాగర సంగమం ప్రదేశంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ చేపడుతోంది. 2020 జనవరిలో నాగాయలంక లైట్హౌజ్, సంగమేశ్వరం, సూర్లగొంది, ఈలచెట్లదిబ్బలో గుడ్ల సేకరణ, సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేశారు. సముద్ర తాబేళ్ల గుడ్ల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రూ. లక్షల్లో నిధులు ఖర్చు చేస్తున్నాయి. 2021లో కృష్ణ వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో ఉన్న సంరక్షణ కేంద్రాల్లో 65 వేల తాబేళ్ల పిల్లలను సముద్రంలో వదిలినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
అవగాహన లోపం వల్ల తాబేళ్ల జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. తాబేళ్లు ఒడ్డుకువచ్చే సమయంలో మత్స్యకారుల బోటు ఫ్యాన్లు తగిలి వేలాది తాబేళ్లు మృత్యువాతపడుతున్నాయి. బోటు ఫ్యాను రెక్కలు తగలకుండా మెష్ ఏర్పాటు, వలలో చిక్కుకుపోకుండా మత్స్యకారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గుడ్ల సేకరణలో కూడా నిపుణులైన సిబ్బంది లేకపోవడంతో గుడ్లు అడవి నక్కల పాలవుతున్నాయి. సముద్ర కాలుష్యం, ఇతర కారణాల వల్ల అంతరించిపోతున్న అరుదైన తాబేళ్లను సంరక్షించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM