ఆవుపై జాతీయ స్థాయి పరీక్ష.. కేంద్రం ప్రకటన
గోవును గురించి జాతీయ స్థాయి ఆన్లైన్ పరీక్షను నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
దిల్లీ: గోవు గురించి జాతీయ స్థాయి ఆన్లైన్ పరీక్షను నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ‘గో విజ్ఞాన్’ లేదా ఆవుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరీక్షించే ఈ ఆన్లైన్ పరీక్షను తొలిసారిగా ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. ఈ ‘కామధేను గో విజ్ఞాన్ ప్రచార్ ప్రసార్ పరీక్ష’ను సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తామని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ (ఆర్కేఏ) చైర్మన్ వల్లభ్ భాయ్ కథిరియా వెల్లడించారు. మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ పరిధిలోకి వచ్చే ఈ సంస్థను ఫిబ్రవరి 2019లో ఏర్పాటు చేశారు. దేశంలో ఆవుల సంరక్షణ, పోషణ, వాటి సంతతి అభివృద్ధి లక్ష్యంగా ఈ సంస్థ విధులు నిర్వహిస్తోంది.
ఎవరికి అవకాశం..
దీనిలో పాఠశాల, కాలేజీ విద్యార్థులు, సాధారణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని.. పరీక్ష ఫీజు ఉచితమని ఆర్కేఏ చైర్మన్ తెలిపారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఫలితాలను వెంటనే ప్రకటించి, అర్హులైన వారికి ధ్రువీకరణ కూడా అందచేస్తారు. అంతేకాకుండా ఈ పరీక్షలో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు కూడా ఉంటాయట.
విద్యార్థులు, సామాన్య ప్రజల్లో దేశీయ ఆవులు, వాటి ప్రాముఖ్యతే కాకుండా.. పాలివ్వని ఆవుల వల్ల కూడా లభించే ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం అందించి, ఆసక్తిని పెంపొందించేందుకు ఈ పరీక్ష ఉపకరిస్తుందని కేంద్రం అంటోంది. ఇందుకు సంబంధించిన స్టడీమెటీరియల్ను కూడా తయారు చేసినట్టు ఆర్కేఏ వెల్లడించింది. అంతేకాకుండా గోవు సంబంధిత అంశాలను గురించి పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న తమ ప్రతిపాదనకు.. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి మంచి స్పందన లభించిందని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ కథిరియా వెల్లడించారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్