ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేసి పెళ్లి మండపానికి ఆలస్యంగా వరుడు.. షాకిచ్చిన వధువు!

ఫ్రెండ్స్‌తో తాగి డ్యాన్స్‌లతో పెళ్లి మండపానికి ఆలస్యంగావచ్చిన వరుడుకి పెళ్లి కూతురు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది......

Published : 29 Apr 2022 02:06 IST

ముంబయి: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఫ్రెండ్స్‌తో తాగి డ్యాన్స్‌లతో పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చిన వరుడుకి పెళ్లి కూతురు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. వివాహ వేదిక వద్దకు వరుడు ముహూర్తం సమయానికి చేరుకోకపోవడంతో వధువు తండ్రి ఆమెను వేరొకరికి ఇచ్చి వివాహం జరిపించడం చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్‌ 22న మల్కాపుర్‌ పంగ్రా గ్రామంలో సాయంత్రం 4 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. అందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. వధువు, ఆమె కుటుంబ సభ్యులంతా వివాహ వేదిక వద్దకు చేరుకొని వరుడి రాక కోసం ఎదురుచూశారు. ముహూర్తం సమయం సాయంత్రం 4 గంటలైతే వరుడు రాత్రి 8 గంటలకు రావడంతో అతడి తీరు పట్ల వధువు తండ్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయడంతో పెళ్లికి వచ్చిన తన బంధువుల అబ్బాయిని సంప్రదించి కుమార్తెతో వివాహం జరిపించారు. 

దీనిపై వధువు తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘పెళ్లి కొడుకు తన ఫ్రెండ్స్‌తో కలిసి తాగాడు. పెళ్లి మండపానికి సాయంత్రం 4 గంటలకు బదులుగా రాత్రి 8 గంటలకు వచ్చి గొడవకు దిగాడు. దీంతో మా అమ్మాయిని బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి జరిపించాం’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని