APPSC: 31 నుంచి గ్రూప్‌-1 హాల్‌టికెట్లు జారీ.. జనవరి 8న ప్రిలిమ్స్‌ పరీక్ష

జనవరి 8న గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈనెల 31 నుంచి హాల్‌ టికెట్లు జారీ చేస్తామని తెలిపింది.

Published : 30 Dec 2022 01:04 IST

అమరావతి: రాష్ట్రంలో 92 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీని ప్రకటించింది. జనవరి 8న గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. మొత్తం 18 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఈనెల 31 నుంచి హాల్‌ టికెట్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు