Cat Garden: పిల్లుల కోసం ఏసీ రూమ్లు.. మినీ థియేటర్!
పెంపుడు జంతువులను కొందరు ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. వాటికోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు
ఇంటర్నెట్ డెస్క్: పెంపుడు జంతువులను కొందరు ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. వాటికోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు. సరైన ఆహారాన్ని ఇస్తూ వాటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. ప్రత్యేక గూడును ఏర్పాటు చేసి వాటిని ఎల్లప్పుడు పర్యవేక్షిస్తుంటారు. అయితే గుజరాత్కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 200 పిల్లులను పెంచుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆయన వాటికోసం ప్రత్యేకంగా ఒక ‘క్యాట్ గార్డెన్’ను ఏర్పాటు చేశాడు. వాటి బాగోగులను చూడటానికి తన సంపాదనలో ప్రతి నెలా 90 శాతం వెచ్చిస్తున్నాడు.
గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో గాంధీ ధామ్కి చెందిన ఉపేంద్ర గోస్వామి కస్టమ్ హౌజ్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. అతని భార్య స్కూల్ ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరి ఇంటి ఆవరణలోని 500 చదరపు గజాల విస్తీర్ణంలో ‘క్యాట్ గార్డెన్’ను 2017లో ఏర్పాటు చేశారు. అందులో 200 పిల్లులను పెంచుతున్నారు. ఈ క్యాట్గార్డెన్ నిర్వహణకు నెలకు రూ.1.5 లక్షల వరకు వెచ్చిస్తున్నారు.
తన సోదరి గుర్తుగానే..
‘ఏటా నా సోదరి బర్త్డేను ఘనంగా నిర్వహించే వాళ్లం. అలా ఒకసారి పుట్టిన రోజు వేడుకలకు తీసుకొచ్చిన కేకును ఓ పిల్లి పూర్తిగా తీనేసింది. అప్పటినుంచి అది మాతోనే ఉండిపోయింది. 1994లో ఆమె మరణించింది. ఆ తర్వాత పెంచుకుంటున్న పిల్లిలోనే మా సోదరిని చూసుకుంటున్నాం. కొద్ది రోజులు గడిచాక ఆ పిల్లి కొన్నింటికి జన్మనిచ్చింది. అలా పుట్టిన వాటిని జాగ్రత్తగా పెంచుతూ వాటికోసం 2017లో క్యాట్ గార్డెన్ను ఏర్పాటు చేశాను. ఇదంతా నా సోదరి గుర్తుగానే చేస్తున్నాను’ అని గోస్వామి తెలిపారు.
క్యాట్గార్డెన్లో ఏమున్నాయంటే..?
గోస్వామి పిల్లుల సౌకర్యార్థం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. క్యాట్గార్డెన్లో 12 బెడ్లతో కూడిన 16 కాటేజీలున్నాయి. చల్లదనం కోసం నాలుగు ఏసీ రూమ్లుంటాయి. వాటి స్నానానికి షవర్ కూడా ఉంటుంది. అంతేకాకుండా వీడియోలు చూపించడానికి ఒక మినీ థియేటర్ ఉంది. ఇందులో రోజూ సాయంత్రం కొన్ని జంతువుల వీడియోలను వాటికి చూపిస్తారు. రోజుకి మూడు సార్లు బ్రాండెడ్ ఆహారాన్ని అందిస్తారు. అలాగే వాటిని తరచూ మెడికల్ చెకప్లకు తీసుకెళ్తారు. దీనికి అహ్మదాబాద్లోని జివ్ దయా ఛారిటబుల్ ట్రస్ట్ సహాయం అందిస్తోంది. ప్రతి ఆదివారం నాలుగు గంటలు సందర్శకుల కోసం ఈ పిల్లులను బయటికి రప్పిస్తారు. కనీస ప్రవేశ రుసుము కట్టి వీటిని సందర్శించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!