Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్రావు
తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీశ్రావు అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ నివేదికను మంత్రి హరీశ్రావు హైదరాబాద్లో విడుదల చేశారు.
హైదరాబాద్: ఉత్తమ వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రగతి నివేదికలు గతేడాది కంటే మెరుగ్గా పని చేసేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. ఆరోగ్యశాఖలో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలా కలిసి పని చేయడం వల్లే ఇంతటి వృద్ధి సాధించామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ నివేదికను మంత్రి హరీశ్రావు హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్ఘటనలు ఎదురైనప్పుడు సమీక్షలు చేసి వాటిని సరిదిద్దుతున్నామన్నారు. కొన్ని రంగాల్లో తెలంగాణ కంటే కేరళ, తమిళనాడు, మహారాష్ట్రాలు ముందున్నాయన్న హరీశ్రావు.. 2022 వైద్యరంగంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని చెప్పారు. వైద్యరంగంలో మెరుగైన పనితీరు కలిగిన మూడో రాష్ట్రంగా తెలంగాణను నీతి ఆయోగ్ గుర్తించిదని అన్నారు. గతేడాదిలో 8 వైద్య కళాశాలలు అందుబాటులోకి రాగా.. మరో 9 వైద్య కళాశాలలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నలుమూలలా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
డబుల్ ఇంజిన్ సర్కారుకు చివరి స్థానం
‘‘ వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నాం. 8 వేల పడకలతో హైదరాబాద్ చుట్టూ నాలుగు సూపర్స్పెషాలటీ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోంది. కొత్తగా 515 డయాలసిస్ యంత్రాలతో 61 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేశాం. ప్రస్తుతం 22 జిల్లాల్లో టీ డయాగ్నొస్టిక్స్ హబ్స్ నడుపుతున్నాం.. త్వరలో మరో 13 జిల్లాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తాం. సుమారు 62శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. గతేడాది 98 బస్తీ దావాఖానాలు అందుబాటులోకి వచ్చాయి. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న ఉత్తర్ప్రదేశ్ వైద్య సేవల్లో చివరిస్థానంలో నిలిచింది. మిడ్ వైఫరీ సేవల్లోనూ తెలంగాణను కేంద్రం, యునిసెఫ్ ప్రశంసించాయి. టీ డయాగ్నస్టిక్స్ను జాతీయ ఆరోగ్య మిషన్ ప్రశంసించింది. ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించాలని జాతీయ ఆరోగ్య మిషన్ చెప్పింది.’’ అని హరీశ్రావు వెల్లడించారు.
మనం దేశానికే ఆదర్శం
రాష్ట్రంలో 31 లక్షల మందికి టెలీ కన్సల్టెన్సీ సేవలు అందించి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హరీశ్రావు అన్నారు. ఎంబీబీఎస్ సీట్లలో దేశంలో తొలిస్థానం, పీజీ మెడికల్ సీట్లలో రెండో స్థానంలో ఉన్నట్లు చెప్పారు. ‘‘ టీబీ నివారణలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు వచ్చింది. గత ఏడాది 716 ఆర్గాన్ ట్రాన్సప్లాంటేషన్లు చేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 27,500 పడకలు ఉంటే వాటన్నిటికీ ఆక్సిజన్ సరఫరా చేశాం. రోగికి అందించే భోజనం ఖర్చును రూ.40 నుంచి రూ.80కి పెంచాం. 18 ప్రధాన ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు సైతం భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు ఐఎంహెచ్ఎంఎఫ్ కింద నిధులు విడుదల చేస్తున్నాం. ఆరోగ్య శ్రీ పథకం కింద 2.59 లక్షల మందికి సేవలు అందించాం. ఆరోగ్య శ్రీ కింద రూ. 5 లక్షల వరకు, తీవ్ర వ్యాధులకు రూ.10 లక్షల వరకు మంజూరు చేస్తున్నాం. రాష్ట్రంలో 887 పీహెచ్సీ కేంద్రాలుండగా.. అన్నింటిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.’’ అని హరీశ్రావు తెలిపారు.
నార్మల్ డెలివరీకి రూ.3000 ఇన్సెంటివ్
2021లో4.21 కోట్ల మంది ఓపీ ద్వారా చికిత్స చేయించుకుంటే.. 2022లో అది 4.80 కోట్లకు పెరిగిందని హరీశ్రావు తెలిపారు. 2021 ఇన్పేషెంట్ బాధితులు 14.16 లక్షలకు కాగా.. 2022లో 16.90 లక్షలకు చేరినట్లు చెప్పారు. 2021లో 2.57 లక్షల శస్త్ర చికిత్సలు చేస్తే.. 2022లో అది 3.04 లక్షలకు పెరిగినట్లు చెప్పారు. ఏడాది కాలంలో 986 మంది వైద్యులను నియమించినట్లు హరీశ్రావు తెలిపారు. మాతాశిశు సంక్షేమానికి రూ.403 కోట్లు కేటాయించామన్నారు. ‘‘ ప్రసవ సమయంలో మహిళలు చనిపోతే ప్రతి మరణాన్నీ నమోదు చేస్తున్నాం. సిజేరియన్ రేట్ తగ్గించేందుకు నార్మల్ డెలివరీ చేసిన వారికి రూ.3000 ఇన్సెంటివ్ ఇస్తున్నాం. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ల ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నాం. గర్భిణీ స్త్రీల కోసం 56 ఆసుపత్రుల్లో టిఫా స్కాన్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాం.
ఐదు అంచెల్లో వైద్య సేవలు
రాష్ట్రంలో ఐదు అంచెల విధానంలో వైద్య సేవలు అందిస్తున్నామన్న హరీశ్రావు..2500 పల్లె దవాఖానాలు ప్రారంభించే ప్రక్రియకు 2022లోనే శ్రీకారం చుట్టామన్నారు.హైదరాబాద్ కాకుండా ఇతర నగరాల్లో 100 బస్తీ ఆసుపత్రుల ఏర్పాటు పనులు ముమ్మరం చేశామన్నారు. ‘‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలోనూ తెలంగాణకు పలు అవార్డులు వచ్చాయి. ఈ ఏడాదిలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ ఏడాది పూర్తయ్యేసరికి 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఆహార కల్తీని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం.’’ అని హరీశ్రావు అన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nalgonda: ఎన్నికల కోడ్.. మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల బంగారం పట్టివేత
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడలో భారీగా బంగారం పట్టుబడింది. -
MLC Kavitha: ఆప్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత అక్రమాలు.. ఈడీ ప్రకటన
భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) ప్రకటన విడుదల చేసింది. -
AP News: ‘ప్రజాగళం’ భద్రతా వైఫల్యంపై సీఈవోకి ఎన్డీయే నేతల ఫిర్యాదు
‘ప్రజాగళం’ సభలో భద్రతా వైఫల్యంపై ఏపీ ఎన్నికల అధికారి ఎం.కె.మీనాకు తెదేపా-జనసేన-భాజపా కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. -
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
Hyderabad News: చల్లబడిన వాతావరణం.. హైదరాబాద్లో వర్షం!
వేసవితాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలకు వరుణుడు ఉపశమనం కల్పించాడు. -
Tamilisai: రాజీనామాపై స్పందించిన తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) స్పందించారు. -
TS News: హోమ్ ఓటింగ్కు ఏప్రిల్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలి: వికాస్రాజ్
లోక్సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. -
Jobs Alert: 5 నోటిఫికేషన్లు.. 25,000+ ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అలర్ట్. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Appsc: గ్రూప్-1 మెయిన్స్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అప్పీల్
2018 నాటి ఏపీ గ్రూప్-1 నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేశాయి. -
MLC Kavitha: ‘నన్ను అక్రమంగా అరెస్టు చేశారు’.. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
అమెరికాలోని మిత్రులకు జీ5 గ్లోబల్ను రిఫర్ చేయండి.. రివార్డులు గెలుచుకోండి!(ADVT)
-
SSC Exams: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. -
టాప్ 10 న్యూస్ @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
AP News: ఈ నంబరు కాదు... ఆ నంబరు! వాలంటీర్ల మరో ఎత్తుగడ
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో కొందరు వాలంటీర్లు కొత్త ఎత్తుగడ వేశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ‘వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించకూడదు. ఎన్నికల ప్రక్రియకు వారిని దూరంగా ఉంచాలి. -
చుక్చుక్ బండి.. చర్లపల్లి సిద్ధమవుతోందండి
నగరానికి మణిహారంగా భావిస్తున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. నిజాముల కాలం నుంచి ఆ మూడు స్టేషన్లేనా అనుకున్న నగరవాసులకు నాలుగోది చర్లపల్లి రైల్వే టర్మినల్ అందుబాటులోకి రానుంది. -
ఎన్నికల వేళ.. సైబర్ వల
లోక్సభ ఎన్నికల వేళ సర్కారు పథకాల బూచి చూపిస్తూ సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
Nalgonda: ఎన్నికల కోడ్.. మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల బంగారం పట్టివేత
-
BJP: జితేందర్రెడ్డి, రంజిత్రెడ్డి ఏ లబ్ధికి కాంగ్రెస్లోకి వెళ్లారు?: రఘునందన్రావు
-
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్తో ప్రగ్యా.. బ్రదర్కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
-
Rahul Gandhi: నా వ్యాఖ్యలను వక్రీకరించారు : రాహుల్
-
NDA: బిహార్లో ‘ఎన్డీయే’ సీట్ల పంపకం పూర్తి.. అధిక స్థానాల్లో భాజపా పోటీ
-
PM Modi: ‘మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’.. పుతిన్కు ప్రధాని మోదీ విషెస్