Telangana news: ఏప్రిల్ 1నుంచి అమల్లోకి ‘హరిత నిధి’
తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హరిత నిధి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తమ నెల జీతాల
హైదరాబాద్: తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హరిత నిధి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తమ నెల జీతాల నుంచి కొద్ది మొత్తంలో విరాళాలు ఇవ్వనున్నారు. మే నెల నుంచి ఉద్యోగుల జీతాల నుంచి ఈ విరాళాలు సేకరిస్తారు. ఇందుకు సంబంధించి పలువురు మంత్రులు, అధికారులతో ఆర్థికమంత్రి మంత్రి హరీశ్రావు సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాఉడుతూ.. హరితనిధి ఏర్పాటు చరిత్రాత్మకమన్నారు. హరితనిధికి జమ అయ్యే నిధులతో నర్సరీలు, మొక్కల పెంపకం చేపట్టనున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ హరిత సంకల్పాన్ని అందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పచ్చదనం పెంచే అంశంలో ఇప్పటికే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నామని చెప్పారు.
గతంలోనే ఉత్తర్వులు..
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు వీలుగా ‘తెలంగాణ హరిత నిధి’ ఏర్పాటైంది. దీని విధివిధానాలను ఖరారుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో ఉత్తర్వులు జారీచేసింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఛైర్మన్గా రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ఏర్పాటుచేశారు. ఈ నిధి వినియోగానికి అటవీశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2015లో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, 230 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యంకాగా, 2021 నవంబరు నాటికి 239.44 కోట్ల మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలతోపాటు స్థానిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఇందులో పాలుపంచుకున్నాయి. హరిత ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ తెలంగాణ హరితనిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటుచేయనున్నట్లు గతేడాది అక్టోబరు 1న శాసనసభ వేదికగా ప్రకటించారు.
నిధుల సమీకరణ ఇలా
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతోపాటు వివిధ వర్గాల నుంచి వచ్చే విరాళాలు, ప్రభుత్వం విధించే పన్నులు, ఫీజుల రూపంలో హరితనిధి సమకూరుతుంది. హరితనిధి రాష్ట్రస్థాయి కమిటీలో అటవీశాఖ మంత్రి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వైస్ ఛైర్మన్గా, పీసీసీఎఫ్ కన్వీనర్గా, పీసీసీఎఫ్ ‘కంపా’, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ, ఆర్థికశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.
నర్సరీల నుంచి.. మొక్కల సంరక్షణ వరకూ
హరితనిధి వినియోగంపై విధివిధానాలను రాష్ట్ర అటవీశాఖ జీవోలో వెల్లడించింది. నర్సరీలను ఏర్పాటుచేయడం, మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, సంరక్షించడం, మొక్కల లెక్కలు తేల్చడం, పచ్చదనంపై అవగాహన పెంచే కార్యక్రమాలు, ప్రణాళికల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ వంటి అవసరాలకు ఈ నిధిని ఉపయోగించాలని స్పష్టంచేసింది. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలను స్వీకరించి హరితనిధి రాష్ట్ర కమిటీకి పంపించాలి. తర్వాత సంవత్సరంలో పెంచే నర్సరీలు, నాటే మొక్కలకు సంబంధించిన ఆమోదాన్ని ఏటా ఆగస్టులోపు పొందాలి. ప్రతి మూణ్నెల్లకోసారి ఈ కమిటీ సమావేశం కావాలి. హరితనిధికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా