కొన ఊపిరితో ఉన్న తల్లికోసం తనయుడి పాట
కరోనా వైరస్ ఎన్నో బాధాకర దృశ్యాలను కళ్లముందుంచుతుంది. చికిత్స అందించే వైద్యులకే కళ్లు చెమర్చేలా చేస్తోంది.
కన్నీరు పెట్టించిన ఘటనను షేర్ చేసిన వైద్యురాలు
దిల్లీ: కరోనా వైరస్ ఎన్నో బాధాకర దృశ్యాలను కళ్ల ముందుంచుతోంది. చికిత్స అందించే వైద్యులకే కళ్లు చెమర్చేలా చేస్తోంది. అన్నీ తెలిసిన వారినే నిస్సహాయులుగా మార్చేస్తోంది. అలాంటి ఓ హృదయవిదారక ఘటనను ఓ వైద్యురాలు ట్విటర్ వేదికగా షేర్ చేశారు. అంతిమ ఘడియలు సమీపించిన తల్లి కోసం ఓ తనయుడు పడిన ఆరాటాన్ని వివరించారు.
‘నా పనిగంటలు ముగించుకొని వెళ్లిపోతున్న సమయంలో నేను చికిత్స అందిస్తోన్న రోగి బంధువులకు ఫోన్ చేశాను. రోగి బంధువుల కోరిక మేరకు అలా చేస్తుంటాం. ఆ సమయంలో కొద్దిసేపు తనకు సమయం కేటాయించమని చెప్పి, కొన ఊపిరితో ఉన్న తల్లిని ఆమె కుమారుడు వీడియో కాల్లో తనివి తీరా చూసుకున్నారు. ఆ వెంటనే హిందీ సినిమాలో ఒక పాటను తన మాతృమూర్తి కోసం పాడుతుంటే.. మా సిబ్బంది అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అతడు పాట పాడుతూ మధ్యలో ఒక్కసారిగా భోరుమన్నారు. దు:ఖంతో నిండిన గొంతు పెగలకపోయినా.. అలాగే పాటనంతా పూర్తి చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి వారందరి కళ్లు చెమర్చాయి. ప్రాణాలతో తిరిగిరాదని తెలిసినా.. చివరగా అమ్మ గురించి తెలుసుకొని హఠాత్తుగా ఫోన్ పెట్టేశారు’ అంటూ దిప్షికా ఘోష్ అనే వైద్యురాలు ట్విటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి పాడిన పాట విడిపోయి, చివరకు ఒక దగ్గరకు చేరిన తల్లీ తనయుడికి సంబంధించినదంటూ ఆమె ఉద్వేగానికి గురయ్యారు. ఇలా మరెవరికీ జరగకూడదంటూ వాపోయారు.
కొన ఊపిరితో ఉన్న తల్లికోసం తనయుడి పడిన ఆరాటం తమను కన్నీరు పెట్టించిందని నెటిజన్లు స్పందించారు. అంతేకాకుండా తమ జీవితంలో జరిగిన ఆ తరహా అనుభవాలను పంచుకుని, తమ బాధను దించుకున్నారు. అలాగే ఈ క్లిష్ట సమయంలో వైద్యులు అందిస్తోన్న సేవలను వారు కొనియాడారు. భారత్లో రెండో దశలో కరోనా ఉద్ధృతి ప్రజల మానసిక ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. వైరస్ నిత్యం లక్షల మందికి సోకుతూ.. ఆరోగ్య వ్యవస్థకు భారంగా పరిణమించింది. తాజాగా 3.62లక్షల మందికి కరోనా సోకగా..నాలుగువేలకు పైగా మరణాలు సంభవించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు