Viveka Murder case: సునీత పిటిషన్‌పై విచారణ ఈనెల 5కి వాయిదా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సునీత పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. 

Updated : 02 Jun 2023 18:13 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సునీత పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు విచారణలో సీబీఐ పీపీకి తమ న్యాయవాది సహకరించేందుకు అనుమతివ్వాలని ఆమె పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సునీత పిటిషన్‌పై శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌ర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై  వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌శంకర్‌రెడ్డి కౌంటర్లు దాఖలు చేయలేదు. సునీత వాదనల కోసం పిటిషన్‌పై విచారణ ఈనెల 5కి వాయిదా పడింది.

వివేకా లేఖపై నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు అనుమతించాలన్న పిటిషన్‌పైనా సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ పిటిషన్‌పై గంగిరెడ్డి, సునీల్ యాదవ్‌ కౌంటర్లు దాఖలు చేయగా.. శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తన వైపు కౌంటరు లేదని దస్తగిరి సీబీఐ కోర్టుకు తెలిపారు. సీబీఐ వాదనల కోసం కేసు విచారణ ఈనెల 5కి వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని