ధవళేశ్వరం వద్ద తగ్గని వరద ఉద్ధృతి
గోదావరి మహోగ్రరూపం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి కాస్త శాంతించినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద ఉన్న ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మాత్రం గోదావరి ..
రాజమహేంద్రవరం: గోదావరి మహోగ్రరూపం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి కాస్త శాంతించినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద ఉన్న ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మాత్రం గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద పెరగడంతో సోమవారం 3గంటలకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి నీటి మట్టం 19 అడుగులకు చేరగా.. ఉదయం 11 గంటల సమయానికి 19.80 అడుగులకు చేరింది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం నుంచి 21.92 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
మరోవైపు రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం పుష్కరఘాట్ వద్ద వరద నీరు 62 అడుగులకు చేరింది. ఘాట్ వద్దనున్న ఆలయాలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. గోదావరి ఉగ్రరూపం తగ్గకపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. మరో రెండు, మూడు రోజులపాటు ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా