అంబులెన్స్ ఖర్చులు.. పేదల గుబులు
కరోనా కష్టాల్లో కరుణ చూపాల్సిన వారు కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. సాటి మనుషుల పట్ల దయ, జాలి చూపడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే పేదలనూ వదలడం లేదు. ప్రాణాలను నిలపాల్సిన అంబులెన్స్ నిర్వాహకులు జేబులు నింపుకుంటున్నారు.
హైదరాబాద్: కరోనా కష్టాల్లో కరుణ చూపాల్సిన వారు కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. సాటి మనుషుల పట్ల దయ, జాలి చూపడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే పేదలనూ వదలడం లేదు. ప్రాణాలను నిలపాల్సిన అంబులెన్స్ నిర్వాహకులు జేబులు నింపుకొంటున్నారు. కొవిడ్ దెబ్బకు అనేక మంది ఉపాధి కోల్పోగా అంబులెన్స్ల యజమానులు మాత్రం తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా సాగిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా, టిమ్స్తో పాటు పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నారు. అనేక మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. వైద్య చికిత్సతో పాటు అత్యవసర సమయాల్లో కొవిడ్ బాధితులను మెరుగైన వైద్యం కోసం వాహనాల్లో తిప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కొందరిని సీటీ స్కాన్తో పాటు ఇతర పరీక్షల కోసం తరలిస్తుంటారు. వాటిని అంబులెన్స్ నిర్వాహకులు అవకాశంగా మలుచుకుంటున్నారు. ఆసుపత్రుల వద్ద తిష్ట వేసి అందిన కాడికి దండుకుంటున్నారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితులపై ఏ మాత్రం కనికరం చూపడం లేదు. రోగి ప్రాణాల మీదకు వచ్చింది.. విషమం.. అంటే చాలు భారీగా వసూలు చేస్తున్నారు. ఒకరిని కాదని, ఇంకొకరిని అడిగినా పరిస్థితిలో మార్పు లేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి.
గతంలో సీటీస్కాన్, ఇతర అవసరాల కోసం వెళ్లాలంటే రూ.1,500 నుంచి రూ.2వేలు తీసుకునేవారు. ప్రస్తుతం రూ.4వేల నుంచి రూ.5వేల వరకు ఇస్తేనే అంబులెన్స్ కదులుతోంది. పీపీఈ కిట్ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సాధారణ సమయాల్లో ధరల కంటే రెండు మూడు రెట్లు ధరలు ఎక్కువ చేసి చెబుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
గ్రేటర్ పరిధిలో సుమారు 500 వరకు ప్రైవేటు చిన్న, పెద్ద అంబులెన్స్లు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని ఆసుపత్రుల నుంచి జిల్లా కేంద్రాలకు రోగులను, మృతదేహాలను తరలించాలంటే రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. 150 నుంచి 175 కిలోమీటర్ల వరకు రూ.8వేల నుంచి రూ.10వేలు తీసుకుంటున్నారు. అధికారుల అనుమతితో పొలాలు, పెరట్లో ఖననం చేసేందుకు తీసుకువెళ్తే రూ.25వేల నుంచి రూ.30వేల వరకు లాగుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల చికిత్సకు ఏ మాత్రం తక్కువ కాకుండా అంబులెన్స్ నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. కిరాయి చెల్లించలేనివారు ఆటోలు, ట్రాలీ ఆటోల్లో తీసుకువెళ్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వైపు చూసేవాళ్లు ఆ వాహనం చూస్తేనే బెంబేలెత్తుతున్నారు. ప్రాణాలు కాపాడటంతో పాటు మృతదేహాలను తరలించాల్సిన అంబులెన్స్ల నిర్వాహకులు ప్రజలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలను నియంత్రించాలని బాధితులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...