TTD: శ్రీవారి దర్శనానికి రెండ్రోజులు.. క్యూ లైన్లలోకి భక్తులను నిలిపివేసిన అధికారులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు దాదాపు 48 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలు భక్తజన సంద్రంగా మారాయి. పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు దాదాపు 48 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుమల వైకుంఠనాథుని దర్శనానికి వచ్చిన భక్తులకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి ఉద్యాన వనాల్లో నిర్మించిన షెడ్లు నిండిపోవడంతో బాహ్యవలయ రహదారిపై కిలోమీటర్ల మేర బారులు తీరారు.
క్యూలైన్లలోకి భక్తులను నిలిపివేసిన అధికారులు
నారాయణగిరి ఉద్యానవనాల నుంచి గోగర్భం జలాశయం వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న క్యూలైన్లలో దర్శనాలకు వెళ్తున్న భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. శిలాతోరణం కూడలి, బాటగంగమ్మ ఆలయం సమీపం, నారాయణగిరి ఉద్యానవనాల కూడలిలోని 3 ప్రాంతాల్లో మాత్రమే భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. నిదానంగా కదులుతున్న క్యూలైన్లతో ఆయా ప్రాంతాలకు చేరడానికి గంటల సమయం పడుతుండటంతో ఆహారం కోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో శనివారం ఉదయం వరకు క్యూ లైన్లలోకి భక్తుల అనుమతి నిలిపివేసినట్టు తితిదే అధికారులు తెలిపారు. ఇవాళ సాయంత్రం క్యూలైన్లోకి ప్రవేశిస్తున్న భక్తులను శనివారం ఉదయం 6గంటలకు రావాలని తిప్పి పంపుతున్నారు. భక్తులు తమ వంతు వచ్చే వరకు సంయమనంతో ఉండాలని కోరారు. అప్పటి వరకు తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయాల్లో విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.
క్యూలైన్లను పరిశీలించిన ఈవో ధర్మారెడ్డి
అశేష సంఖ్యలో తిరుమలకు భక్తులు రావడంతో రద్దీ పెరిగిందని తితిదే ఈవో ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి గోగర్భం వద్ద అధికారులతో కలిసి క్యూలైన్లను ఈవో పరిశీలించారు. భక్తులతో మాట్లాడి తితిదే అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం క్యూలైన్లో ఉన్న భక్తులు శ్రీవారి దర్శనానికి రెండ్రోజుల సమయం పడుతుందని తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు రేపు ఉదయం క్యూలైన్లలోకి రావాలని సూచించారు. తితిదే ఏర్పాటు చేసిన ఆవాస కేంద్రాల్లో భక్తులు విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఉచిత బస్సుల ద్వారా భక్తులను ఆవాస కేంద్రాలకు పంపిస్తున్నామన్నారు. తితిదేలో విభాగాలు, పోలీసుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సేవ అందిస్తున్నామన్నారు. భక్తుల రద్దీ వల్ల కొద్దిగా అసౌకర్యం కలుగుతోందని, భక్తులు స్వామివారిని స్మరిస్తూ ముందుకు వెళ్లి దర్శనం చేసుకోవాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్