TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. క్యూలైన్లోని భక్తులకు తితిదే తాగునీరు, అన్నప్రసాదాలను అందిస్తోంది.
తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. శనివారం సాయంత్రానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లలో నిండిపోయి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. వీరికి సుమారు 24 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. క్యూలైన్లోని భక్తులకు తితిదే తాగునీరు, అన్నప్రసాదాలను అందిస్తోంది. శుక్రవారం శ్రీవారిని 79,486 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.72 కోట్లు హుండీ కానుకలు లభించాయి. 40,250 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.