Telangana News: వాహనం దిగి హోంగార్డును అభినందించిన హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్చంద్రశర్మ
విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డును తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సతీశ్చంద్ర శర్మ అభినందించారు.
హైదరాబాద్: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డును తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సతీశ్చంద్ర శర్మ అభినందించారు. హోంగార్డుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. అష్రాఫ్ అలీ అనే హోంగార్డు అబిడ్స్ ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్నారు. బషీర్బాగ్లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం కూడలి వద్ద ఆయన విధులు నిర్వహిస్తున్నారు. రోజూ అదే మార్గంలో సీజే జస్టిస్ సతీశ్చంద్ర శర్మ రాకపోకలు సాగిస్తుంటారు.
హోంగార్డు అంకితభావంతో విధులను నిర్వహిస్తూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం సీజేను ఆకట్టుకుంది. దీంతో శుక్రవారం అదే మార్గంలో వెళ్తూ హోంగార్డును చూసి వాహనాన్ని ఆయన ఆపారు. అనంతరం హోంగార్డు అష్రాఫ్ అలీకి పుష్పగుచ్ఛం ఇచ్చి అతడి సేవలను అభినందించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ తనను అభినందించడం గర్వంగా ఉందని అష్రాఫ్ అలీ ఆనందం వ్యక్తం చేశారు. మరింత ఉత్సాహంగా తన విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. హోంగార్డును ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.