విటమిన్ డితో కరోనా మరణాలకు చెక్!
విటమిన్ డికి క్రియాశీల రూపమైన కాల్సిఫెడియోల్.. కరోనా కారణంగా ఐసీయూల్లో చేరిన వారి పాలిట వరంగా మారినట్లు తెలుస్తోంది.
ముంబయి: ‘విటమిన్-డి’కి క్రియాశీల రూపమైన కాల్సిఫెడియోల్.. కరోనా కారణంగా ఐసీయూల్లో చేరిన వారి పాలిట వరంగా మారినట్లు తెలుస్తోంది. కాల్సిఫెడియోల్ను రోగులకు అధిక మోతాదులో ఇవ్వడం వల్ల ఐసీయూల్లో చికిత్స పొందే అవసరాన్ని చాలావరకు తగ్గిస్తోందని స్పెయిన్ పరిశోధకులు వెల్లడించారు. తక్కువ ధరతో లభ్యమయ్యే, కొత్త యాంటీవైరల్ ఔషధాలకు సంబంధించిన అన్వేషణలో భాగంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సైన్స్ డైరెక్ట్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం..76 మంది కరోనా బాధితుల్లో 50 మందికి కాల్సిఫెడియోల్ ఔషధాన్ని అందించగా వారిలో ఒకరికి మాత్రమే ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి ఎదురైందని పరిశోధకులు వెల్లడించారు. 49మందిలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదన్నారు. ఆ ఔషధాన్ని స్వీకరించని వారిలో 13మంది ఐసీయూలో చేరగా, ఇద్దరు మరణించారని తెలిపారు.
‘అధిక మోతాదులో కాల్సిఫెడియోల్ లేక 25 హైడ్రాక్సీ విటమిన్ డి.. ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులకు ఐసీయూ అవసరాన్ని తగ్గిస్తుందని మా అధ్యయనంలో వెల్లడైంది’ అని పరిశోధకుల్లో ఒకరైన మార్టా ఎంట్రినాస్ కాస్టిల్లో వెల్లడించారు. ఈ ఔషధం కొవిడ్ వ్యాధి తీవ్రతను తగ్గిస్తున్నప్పటికీ, కచ్చితమైన సమాధానం కోసం మరింత అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతానికి కరోనా వ్యాధిగ్రస్తుల్లో మరణాల సంఖ్యను తగ్గించే విషయంలో డెక్సామెథసోన్ స్టెరాయిడ్ మాత్రమే ఆశించిన ఫలితాలను ఇస్తున్నట్లు వెల్లడైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు