AP: కరోనాతో 96మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా నాలుగు రోజుల పాటు 20వేలకు పైగా పాజిటివ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా నాలుగు రోజుల పాటు 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, శుక్రవారం కాస్త తగ్గినట్లు కనిపించింది. అయితే, గత 24 గంటల్లో మళ్లీ 20వేల మందికి పైగా కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. మొత్తం 1,10,571 శాంపిల్స్ పరీక్షించగా, 20,065మంది కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. పాజిటివిటీ రేటు 19.75శాతం ఉండగా, అత్యధికంగా 96మంది మృతి చెందినట్లు వెల్లడించారు.
చిత్తూరులో అత్యధికంగా 2,269 కరోనా బారిన పడ్డారని, ఆ తర్వాత తూర్పుగోదావరి 2,370, విశాఖ 2525లలో అత్యధిక కేసులు నమోదైనట్లు వివరించారు. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 7,065 ఐసీయూ పడకలు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పటికే 6,300లకు పైగా పడకలు కరోనా బాధితులతో నిండిపోయానని వివరించారు. గత 24గంటల్లో 19,272మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 10,69,432కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,87,392 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ వల్ల పశ్చిమగోదావరిలో 14మంది చనిపోగా, విశాఖలో 12, అనంతపురం 10, గుంటూరు 10, తూర్పుగోదావరి 9, విజయనగరం 9, కర్నూలు 7, నెల్లూరు 7, చిత్తూరు 6, కడప 5, కృష్ణా 4, శ్రీకాకుళం 3 చొప్పున మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 8615కు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు