Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం ఇసుక రీచ్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ రీచ్‌ నుంచి రెండు రోజులుగా వైకాపా నాయకులు రైతు భరోసా కేంద్రం నిర్మాణం కోసమని చెబుతూ ఇసుక తరలించారు.

Published : 03 Oct 2022 16:47 IST

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం ఇసుక రీచ్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ రీచ్‌ నుంచి రెండు రోజులుగా వైకాపా నాయకులు రైతు భరోసా కేంద్రం నిర్మాణం కోసమని చెబుతూ ఇసుక తరలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారంటూ మరో వర్గం వారు అభ్యంతరం తెలిపారు. ఇసుకను తరలించే ట్రాక్టర్‌ టైర్లకు అడ్డంగా పడుకొని ఆందోళన చేశారు. దీంతో సమస్య సెబ్‌ అధికారుల దృష్టికి వెళ్లింది. వారు వచ్చి పత్రాలు ఏం పరిశీలించకుండానే ఇసుక ట్రాక్టర్‌ను వదిలేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని