National news: గుర్రం అంతిమయాత్రకు వందల మంది హాజరు
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ వందల మంది ఓ గుర్రం అంతిమయాత్రకు హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు....
బెంగళూరు: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ వందల మంది ఓ గుర్రం అంతిమయాత్రకు హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాష్ట్రం బెళగావిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మరాడిమఠ్ గ్రామంలో స్థానికంగా ఉండే ఓ మత సంస్థకు చెందిన గుర్రం అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతిచెందింది. అయితే ఆ గుర్రం అంతిమయాత్ర నిర్వహించగా.. వందల మంది గ్రామస్థులు అందులో పాల్గొన్నారు. కరోనా విజృంభిస్తున్నా.. వారంతా ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఆ అంతిమయాత్రలో పాల్గొన్నారు. వారిలో చాలా మంది మాస్కులు కూడా ధరించలేదు.
అయితే ఆ అంతిమయాత్రకు సంబంధించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అప్రమత్తమైన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. గ్రామాన్ని సీల్ చేశారు. గ్రామస్థులకు ప్రస్తుతం వైద్య సిబ్బంది ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. మరో 14 రోజులు గ్రామం నిర్బంధంలోనే ఉండనున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ లక్ష్మణ్ నింబర్గి పేర్కొన్నారు.
కర్ణాటకలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నుంచి లాక్డౌన్ విధించింది. 24వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపింది. కాగా తాజాగా జూన్ 7 వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటకలో ఇప్పటివరకు 24 లక్షలకు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. 25 వేలకు పైగా మంది మృతిచెందారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 4.73 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..