Covid-19: గుండెపై కరోనా ప్రభావం ఎలా అంటే..?
మానవుల్లో ప్రధాన అవయవం అయిన గుండెపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ వైరస్ గుండె లోపలి కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తున్నాయని తెలిపారు. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్
వాషింగ్టన్: మానవుల్లో ప్రధాన అవయవం అయిన గుండెపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ వైరస్ గుండె లోపలి కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తున్నాయని తెలిపారు. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్లో గత ఏడాది ఈ వివరాలు ప్రచురించారు. కరోనా సోకిన తర్వాత చాలా మందికి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతుండటంతో పరిశోధకులు ఈ విషయంపై దృష్టి పెట్టారు. కరోనా వైరస్ గుండె లోపలి కణాలపై దాడి చేసి చంపేయడంతో దాని ప్రభావం గుండె సంకోచ వ్యాకోచాలపై పడుతున్నట్లు వారు గుర్తించినట్లు తెలిపారు. సాధారంగా ఇలాంటి పరిస్థితుల్లో గుండెలో మంట వస్తుంది. కానీ కరోనా కారణంగా ఈ సమస్య ఎదురైతే మంట వంటి లక్షణాలు కూడా కనిపించట్లేదని పరిశోధనలో పాల్గొన్న కోరీ జె లావినె తెలిపారు.
కరోనా వైరస్ ప్రధానంగా గుండె లోపలి కణాలతో పాటు, రోగ నిరోధక వ్యవస్థలోని టి, బి కణాలపై దాడి చేస్తుందన్నారు. ఇతర వైరస్లతో పోలిస్తే కరోనా దాడి చేయడం వల్ల గుండె భిన్నంగా ప్రతిస్పందిస్తున్నట్లు గమనించినట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కరోనా ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. యువకుల్లో వారు చేసే శారీరక శ్రమ ఆధారంగా లక్షణాల్లో స్వల్ప మార్పులుంటాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో