Coronavaccineల నుంచి ఎంతకాలం రక్షణ?
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే, ఈ టీకాలు ఎంతకాలం పనిచేస్తాయనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. వీటిపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.
కొనసాగుతోన్న పరిశోధనలు
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ దాదాపు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే, ఈ టీకాలు ఎంతకాలం పనిచేస్తాయనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. వీటిపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో పలు దేశాల్లో వెలుగు చూస్తోన్న కొత్తరకాలపై టీకాల పనితీరునూ విశ్లేషిస్తున్నారు. వీటి ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిపైనే అధ్యయనం కొనసాగించాల్సి ఉన్నందున.. ఇందుకు మరికొంత సమయం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కనీసం 6నెలల రక్షణ..
ప్రపంచ వ్యాప్తంగా గత ఐదారు నెలలుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఫైజర్ టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కనీసం 6నెలల పాటు రక్షణ ఇస్తుందని ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల్లో తేలింది. అంతకంటే ఎక్కువ కాలం కూడా రక్షణ ఇస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇక అమెరికాకు చెందిన మోడెర్నా టీకా రెండో డోసు తీసుకున్న 6నెలల తర్వాత కూడా యాంటీబాడీలు కనిపిస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన పరిశోధకుడు డెబోరా ఫుల్లెర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న వ్యాక్సిన్లు జీవితాంతం రక్షణ కల్పించకపోవచ్చని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్కు చెందిన నిపుణుడు డాక్టర్ కథ్లీన్ న్యూజిల్ వెల్లడించారు. ఒక ఏడాది కాలమైతే ఇవి రక్షణ కల్పిస్తాయనే నమ్మకముందన్నారు. కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వేరియంట్లు కోసం అదనంగా మరో డోసు తీసుకోవాల్సి రావచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు ఒకరకమైన స్పైక్ ప్రొటీన్ల నుంచి రక్షణ కల్పించేందుకు ఉద్దేశించబడినవని అమెరికాలోని ఎమోరీ వ్యాక్సిన్ సెంటర్కు చెందిన మెహుల్ సుథార్ పేర్కొన్నారు. వైరస్లో మ్యుటేషన్లు జరుగుతున్నాకొద్దీ వాటిని ఎదుర్కొనేందుకు బూస్టర్ డోసులు అవసరం కావచ్చన్నారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు కొత్తరకాలపైనా పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా తేలడం ఊరట కలిగించే విషయమని చెప్పారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య పెరిగినప్పుడు వైరస్ వ్యాప్తి తగ్గడంతో పాటు కొత్తరకాల ప్రభావం కూడా తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన పలు నివేదికలు కూడా 6నెలల నుంచి కొన్ని ఏళ్లపాటు వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తాయని అంచనా వేశాయి.
టీ కణాలు దోహదం..
వైరస్లను ఎదుర్కోవడంలో కేవలం యాంటీబాడీలే కాకుండా శరీరంలో బీ, టీ కణాల వ్యవస్థ కూడా దోహదపడుతుంది. యాంటీబాడీలు తగ్గిపోతున్నా ఈ కణాలు చాలా కాలం పాటు ఉంటాయి. మళ్లీ అదే వైరస్ భవిష్యత్తులో శరీరంలో దాడి చేసినప్పుడు ఈ కణాలు వాటిని గుర్తించి వెంటనే ప్రతిస్పందిస్తాయి. అయితే, పూర్తి స్థాయిలో అవి పోరాడకపోయినా.. పరిస్థితి తీవ్రరూపం దాల్చకుండా రక్షిస్తాయి. అయితే, ఇటువంటి కణాలు ఎంతకాలం, ఏమేరకు పనిచేస్తాయన్న విషయం మాత్రం కచ్చితంగా తెలియదు.
వ్యాక్సిన్ తీసుకున్నా..జాగ్రత్తలు తప్పనిసరి
కరోనా వ్యాక్సిన్లు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయని ప్రస్తుతానికి కచ్చితంగా చెప్పలేమని ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి కేవలం ఐదు నుంచి ఆరు నెలలు మాత్రమే అవుతున్నందున వీటిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలని భారత ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట