ఉప్పు నీటి సమస్యా.. జుట్టును ఇలా కాపాడుకోండి!
ఉప్పుతో చాలా అనర్థాలు ఉన్నాయి. వంటల్లో ఉప్పు ఎక్కువ అయితే బీపీ పెరుగుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉప్పుతో చాలా అనర్థాలు ఉన్నాయి. వంటల్లో ఉప్పు ఎక్కువ అయితే బీపీ పెరుగుతుంది. దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అదేవిధంగా ఉప్పు ఉన్న నీటితో తలస్నానం చేసినట్లయితే జుట్టు పాడవుతుంది. ఉప్పునీటిలో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడం, చివర్లు చిట్లిపోవడం, మృధుత్వం దెబ్బతినడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
ఉప్పు నీటిలో ఉండే కాల్షియం లవణాల వల్ల వెంట్రుకల చివర్లు చిట్లి క్రమంగా ఊడిపోతాయి. పొడిబారినట్లై.. కొన్నిసార్లు జుట్టు ఎండుగడ్డిలా మారడం, పల్చబడటం, నెరవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కండిషనర్ వాడుతున్నప్పటికీ ఈ సమస్యలు తొలగిపోవు. అలాంటపుడు నీటిలో లవణాలు ఎంత మేరకు ఉన్నాయో గుర్తించాలి. అందుకోసం నీటి కాఠిన్యతను పరీక్షించాలి. ఒక మగ్గు నీటిలో సబ్బు వేసి నురగ వచ్చేదాకా బాగా కలపాలి. నురగ బాగా వస్తే ఆ నీరు కఠిన జలం కాదని తెలుస్తుంది. ఒకవేళ నురగ రాకపోతే ఆ నీటిని తలస్నానానికి వాడకూడదు.
ఉప్పునీటి దుష్ప్రభావాల నుంచి జుట్టును కాపాడుకోవడానికి కొబ్బరినూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరినూనె వెంట్రుకలలో ఉన్న ప్రొటీన్ను కాపాడుతుంది. కాబట్టి తలస్నానం చేయడానికి ముందు, తర్వాత కొబ్బరినూనెను తలకు పట్టించుకోవాలి. అలాగే వెనిగర్ వెంట్రుకల పీహెచ్ స్థాయులను నియంత్రిస్తుంది. జుట్టు నున్నగా ఉండటానికి, నిగనిగలాడ్డానికి దోహదం చేస్తుంది. అందువల్ల తలస్నానం చేసిన తర్వాత మూడు గ్లాసుల నీటిలో ఒక చెంచా వెనిగర్ కలిపి దాన్ని జుట్టుకు రాసుకోవాలి. కొద్ది నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి. నిమ్మరసంతో కూడా ఇలాంటి ఫలితమే కనిపిస్తుంది. వీటితో పాటూ కుళాయిలకు లవణాలను తొలగించే పరికరాలను అమర్చుకోవడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలను నివారించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల