TSRTC: కాసులు కురిపించిన సంక్రాంతి.. 11 రోజుల్లో రూ.165 కోట్ల ఆదాయం
టీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి సందర్భంగా 11 రోజుల్లో రూ.165.46 కోట్ల ఆదాయం వచ్చిందని యాజమాన్యం తెలిపింది. గతేడాదితో పోలిస్తే దాదాపు 12లక్షల మంది అదనంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని వెల్లడించింది.
హైదరాబాద్: సంక్రాంతి పండుగ టీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. సంక్రాంతి సందర్భంగా సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం వల్ల అనూహ్య స్పందన వచ్చిందని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ముందస్తు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్ లో 10శాతం రాయితీ, టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి, ఎండీ సజ్జనార్లు తెలిపారు. ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు 11 రోజుల్లో రికార్డు స్థాయిలో 2.82 కోట్ల మంది ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిందన్నారు.
గతేడాదితో పోలిస్తే దాదాపు 12లక్షల మంది అదనంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని యాజమాన్యం వెల్లడించింది. సంక్రాంతికి 11 రోజుల్లో రూ.165.46 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రూ.62.29కోట్లు ఎక్కువగా ఆదాయం వచ్చిందన్నారు. సంక్రాంతికి 3.57 కోట్ల కిలోమీటర్ల టీఎస్ఆర్టీసీ బస్సులు తిరిగాయని, గతేడాదితో పోలిస్తే 26.60లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయని యాజమాన్యం వెల్లడించింది. ప్రతి రోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయన్నారు. గతేడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో 59.17గా ఉంటే .. ఈ సంక్రాంతికి ఓఆర్ 71.19 పెరిగిందని ఆర్టీసీ పేర్కొంది. సాధారణ ఛార్జీలతోనే 3,923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెరిగిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు