Hyderabad: ఎయిర్‌పోర్టుకు మెట్రో.. ఈనెల 13 వరకు బిడ్‌ల స్వీకరణ

నగరంలోని విమానాశ్రయం మెట్రో నిర్మాణం కోసం ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీల ప్రీ బిడ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డితో పాటు ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు.

Published : 06 Dec 2022 15:04 IST

హైదరాబాద్‌: నగరంలోని విమానాశ్రయం మెట్రో నిర్మాణం కోసం ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీల ప్రీ బిడ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డితో పాటు ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. నేటి నుంచి ఈనెల 13 వరకు కన్సల్టెన్సీల నుంచి బిడ్‌లను స్వీకరించనున్నారు. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,250 కోట్ల అంచనాతో 31 కి.మీ దూరం మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఈనెల 9న మెట్రో నిర్మాణానికి రాయదుర్గంలో సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయనున్నారు. 

మహానగరాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంతో అనుసంధానం చేస్తూ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. ఐటీ హబ్‌ మైండ్‌ స్పేస్‌ (రాయదుర్గం మెట్రో స్టేషన్‌) నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి 31 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో లైను నిర్మించనున్నట్లు తెలిపింది. మైండ్‌స్పేస్‌ నుంచి గచ్చిబౌలి, నానక్‌రాంగూడ జంక్షన్‌ల నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు కొత్తగా మెట్రో రైలు సౌకర్యం రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని