AP news: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా స్వప్నిల్ దినకర్‌, చిత్తూరు జాయింట్...

Updated : 26 Jul 2021 22:38 IST

అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా స్వప్నిల్ దినకర్‌, చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా రాజబాబు, సెర్ప్‌ సీఈవోగా ఇంతియాజ్‌ అహ్మద్‌లను నియమించింది.  మైనారిటీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా గంధం చంద్రుడు, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా సుమిత్‌ కుమార్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జాయింట్ కలెక్టర్‌గా బి.ఆర్‌. అంబేడ్కర్‌ను నియమించడంతోపాటు సీసీఎల్‌ఏ అప్పీల్ డైరెక్టర్‌గా ఇంతియాజ్‌ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని