పక్షవాత రోగుల కోసం వినూత్న ఆవిష్కరణ!
గుజరాత్లోని గాంధీనగర్ ఐఐటీకి చెందిన మెకానికల్ విభాగానికి చెందిన బృందం ఓ వినూత్న ఆవిష్కరణకు రూపం పోసింది. మనిషికి పక్షవాతం లేదా ఇతర జబ్బు లక్షణాలు......
గాంధీనగర్: గుజరాత్లోని గాంధీనగర్ ఐఐటీకి చెందిన మెకానికల్ విభాగానికి చెందిన బృందం ఓ వినూత్న ఆవిష్కరణకు రూపం పోసింది. మనిషికి పక్షవాతం లేదా ఇతర జబ్బు లక్షణాలు మొదలైనపుడు నరాల వ్యవస్థ దెబ్బతిని నడక, మాటతీరు, విషయాల్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి ఇబ్బందుల నుంచి మనిషిని తిరిగి సాధారణ స్థితికి ప్రేరేపించేలా చేసే రొబోటిక్ లెగ్ ఎక్సోస్కెలిటన్ అనే పరికరాన్ని రూపొందించారు. వినీత్ వశిష్ట అనే ప్రొఫెసర్ నేతృత్వంలో రూపొందించిన ఈ లెగ్ ఎక్సోస్కెలిటన్కు వారు ‘వియర్స్’ అని నామకరణం చేశారు.
ఈ పరికరం గురించి ప్రొఫెసర్ వినీత్ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా పక్షవాతం వచ్చిన వారికి నరాల వ్యవస్థ దెబ్బతినడం వల్ల కదలికల్లో ఇబ్బందులు మొదలవుతాయి. నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే లెగ్ ఎక్సోస్కెలిటన్ తయారు చేశాం. ఈ రొబోటిక్ పరికరాన్ని శరీరానికి బిగించడం ద్వారా.. మన శరీరంలోని కండరాల్ని కొంత బాహ్య శక్తి ద్వారా కదలికలకు ఉత్తేజపరుస్తాయి. దీన్ని ధరించి నడవడం ద్వారా మనిషి శరీర కదలికల్లో కొంతమేర అయినా సాధారణ స్థితిని తిరిగి పొందవచ్చు. ఇది చాలా తేలికగా ఉంటుంది. సులువుగా ధరించొచ్చు’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు