AP Governor: గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు అస్వస్థత

ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయన మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు.

Updated : 18 Sep 2023 17:35 IST

అమరావతి: ఏపీ గవర్నర్‌(AP Governor) జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌(Abdul Nazeer) అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో ఆయన చేరారు. కడుపు నొప్పి కారణంగా గవర్నర్‌ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. రాజ్‌భవన్‌ అధికారుల నుంచి సమాచారం అందుకున్న వైద్యులు విజయవాడ వచ్చి గవర్నర్‌కు పరీక్షలు చేశారు. ఆస్పత్రిలో చేరాలని సూచించారు. వైద్య నిపుణుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని