Telangana News: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. రాగల రెండు రోజులు భారీ వర్షాలు!

తెలంగాణలో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌...

Published : 19 Aug 2022 16:32 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్ర అల్పపీడనం ఇవాళ ఉదయం వాయుగుండంగా బలపడిందని తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని పేర్కొంది. ఇది బాలాసోర్‌కి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కి.మీ, సాగర్‌ దీవులకు ఆగ్నేయ దిశగా 150కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 6 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తీరాల్లోని బాలాసోర్‌, సాగర్‌ ద్వీపం మధ్యన ఇవాళ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వివరించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, ఉత్తర చత్తీస్‌గఢ్‌ మీదుగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని