Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
భారీగా అలంకరణ, డీజే చప్పుళ్లు, బాణాసంచా లేకుండా.. గుర్రంపై వరుడి ఊరేగింపు లేకుండా పెళ్లిల్లు జరుపుకోవాలని........
జైపూర్: ఈరోజుల్లో పెళ్లంటేనే భారీ డెకరేషన్లు, డీజే సౌండ్లు, ముస్తాబులు, ఇతరత్రా ఆర్భాటాలు.. కాలం మారుతున్నా కొద్దీ వివాహాల సంస్కృతి మారుతూ వస్తోంది. దీంతో కొందరు తమ తాహతుకు మించి ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా వారు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ పాలిలోని రెండు సామాజికవర్గాలు ఈ హంగూఆర్భాటాలకు స్వస్తి పలకాలని నిశ్చయించుకున్నాయి. వివాహాలను చాలా తక్కువ ఖర్చుతో చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి.
భారీగా అలంకరణ, డీజే చప్పుళ్లు, బాణాసంచా లేకుండా.. గుర్రంపై వరుడి ఊరేగింపు లేకుండా వివాహాలు జరుపుకోవాలని కుమావత్, జాట్ సామాజిక వర్గాల నేతలు నిర్ణయించాయి. వధూవరులకు ఇచ్చే నగలు, నగదు, దుస్తుల లాంటి బహుమతులపై కూడా పరిమితులు విధించేందుకు సిద్ధమయ్యాయి. వరుడితోపాటు, వివాహానికి హాజరయ్యే వారికి గడ్డం ఉండకూడదని స్పష్టం చేశారు. వివాహ వేడుకను దైవ కార్యంగా, వరుడ్ని రాజుగా భావించే పెళ్లిలో వరుడికి గడ్డం ఉండకూడదని, పెళ్లికి వచ్చేవారు కూడా గడ్డాలతో రాకూడదని కుమావత్ వర్గం నేత లక్ష్మీ నారాయణ్ తిలక్ వెల్లడించారు. అలంకారాలు, మ్యూజిక్, ఇతర పనులకు డబ్బును వృథా చేయడం అనవసరం అని పేర్కొన్నారు.
అదేవిధంగా, పాలిలోని రోహెత్ సబ్డివిజన్లోని ఐదు గ్రామాలకు చెందిన జాట్ కమ్యూనిటీ నేతలు కూడా వివాహ కార్యక్రమాలను భారీగా చేయకూడదని నిబంధనలను రూపొందించుకున్నారు. వివాహ ఊరేగింపులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ‘సమాజంలోని అన్ని కుటుంబాల వివాహాల్లో ఏకరూపత కోసం కొన్ని సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించుకున్నాం’ అని భకరివాలా గ్రామ సర్పంచి అమ్నారం బెనివాల్ తెలిపారు. ‘డబ్బు ఉన్నవాళ్లు వివాహాలను ఆర్భాటంగా చేస్తున్నారు. ఇవి మధ్యతరగతి, పేదవారిపై ప్రభావం చూపుతున్నాయి. వారు కూడా ఈ తరహాలో చేయాలని అప్పులపాలవుతున్నారు. సమాజంలో సమానత్వం, వివాహ కార్యక్రమాలలో ఏకరూపత తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నియమాలను తీసుకొచ్చాం’ అని సర్పంచి వెల్లడించారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి..
ఈనాడు-ఈటీవీ తెలంగాణ కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న బాలుడి పరిస్థితిని వివరిస్తూ ఈనాడు-ఈటీవీలో కథనం వచ్చింది. -
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. -
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
తెలంగాణ గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. -
గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
-
Flight Journey: ‘బరువు ఉన్నామని విమానం నుంచి దించేశారు’
-
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్