త్రివర్ణ శోభితంగా ముస్తాబైన ఎర్రకోట
74వ స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట సిద్ధమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంత నిరాడంబరంగా అతి కొద్ది మంది అతిథుల నడుమ ఈ సంబురాలు జరగనున్నాయి. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబోతున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం
శనివారం ఉదయం 7.30 గంటలకు జెండా ఆవిష్కరించనున్న ప్రధాని
దిల్లీ: 74వ స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట సిద్ధమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంత నిరాడంబరంగా అతి కొద్ది మంది అతిథుల నడుమ ఈ సంబరాలు జరగనున్నాయి. ఈ సారి 22 మంది అధికారులతోనే గౌరవ వందనం స్వీకరించబోతున్నారు. దిల్లీ పోలీసులు ఈసారి కేవలం 350 మందే పాల్గొనబోతున్నారు. గతంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించి ఉండేవి. కానీ ఈసారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తిస్థాయిలో 350 మంది పోలీసులను కూడా 14రోజుల క్వారంటైన్ తరువాత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కరోనాను జయించిన పోలీసులు, ప్రభుత్వ అధికారులను ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నారు. అందరూ కూర్చునేందుకు భౌతిక దూరంతో కుర్చీలు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యేవారు. కానీ ఈసారి విద్యార్థులు హాజరు కావద్దంటూ అధికారులు ఆదేశించారు.
ఎర్రకోట ప్రాంగణం ఇప్పటికే త్రివర్ణ శోభితాన్ని సంతరించుకుంది. ప్రధాని మోదీ మువ్వన్నెల జెండాను ఎగురవేసిన తరువాత ప్రసంగించేందుకు బుల్లెట్ప్రూఫ్ గ్లాస్క్లోజర్, అతిథులు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య వేడుకల అతిథుల జాబితాను 150కి కుదించినట్లు తెలుస్తోంది.
ఈసారి 5వేల మందే!
ఎర్రకోటలో ఏర్పాట్లన్నీ పూర్తి కాగా గురువారం తెల్లవారుజామున చిరుజల్లుల మధ్యలోనే త్రివిధ దళాలు రిహార్సల్స్ నిర్వహించాయి. ఏటా 30వేల మందికి పైగా హాజరయ్యే ఎర్రకోటలో ఈసారి 5వేల మందితోనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కుర్చీల మధ్య రెండు గజాల దూరం ఉండనుంది. మాస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఉదయం 7.21 గంటలకు ఎర్రకోట చేరుకొని 7.30 గంటలకు జెండా ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా ఉద్ధృతి, సవాళ్లు, ఆత్మనిర్బర్ భారత్ సహా మరిన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు