Postal jobs: తపాలా శాఖలో 40,889 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే?
తపాలా శాఖ (Postal Jobs) భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతిలో సాధించిన మార్కులను ఆధారంగా తీసుకొని ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
దిల్లీ: పదో తరగతిలో మెరుగైన మార్కులు సాధించారా? అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central government Job) పొందే అవకాశం మీకు ఉన్నట్టే. తపాలా శాఖ (Indian post)లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job notification) వచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో మొత్తం 40,889 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి అర్హతపై పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM) / డాక్ సేవక్ (Dak sevak) ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 16వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్లో ముఖ్యాంశాలు
- ఏపీలో 2480, తెలంగాణలో 1266 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు తపాలా శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది.
- యూపీలో గరిష్ఠంగా 7,989 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా.. తమిళనాడులో 3167; కర్ణాటకలో 3036; కేరళలో 2462 చొప్పున దేశవ్యాప్తంగా మొత్తంగా 40,889 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
- జనవరి 27 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకొనేందుకు ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీవరకు అవకాశం కల్పించారు.
- ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం రావాలి.
- పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండడం తప్పనిసరి.
- ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి.
- బీపీఎం ఉద్యోగాలకు వేతనం రూ.12 వేలు నుంచి గరిష్ఠంగా రూ.29,380; ఏబీపీఎం / డాక్సేవక్కు రూ.10వేలు నుంచి గరిష్ఠంగా రూ.24,470 మధ్య చెల్లిస్తారు.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ఉమెన్లకు దరఖాస్తు రుసుం లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.వంద చొప్పున చెల్లించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్